పూర్వకాలం రాణివాసంలో నిరసనలు తెలియజేయటానికో ప్రత్యేకమైన స్థలం ఉండేది. రాణిగారు అందులో ఉన్నారంటే అర్థం ఆమె కోపతాపాలలో ఉన్నారని, లేదా శోకంలో కూరుకుపోయి ఉన్నారని.
ఓల్డ్ ఎమ్మల్యే క్వార్టర్స్ లో ఒక పార్టీ తర్వాత మరో పార్టీ దీక్షలు చేస్తుండటాన్ని కాంగ్రెస్ శాసన సభ్యుడు వీరశివారెడ్డి సమ్మతించలేకపోతున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రస్తుతం వైయస్ ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అక్కడ దీక్షలో ఉన్నారు.
శాసన సభ్యుల నివాస ప్రాంగణంలో దీక్షలు ఎలా చేస్తారని, అందుకు అనుమతులిచ్చారా, ఇస్తే ఎలా ఇచ్చారంటూ వీరశివారెడ్డి శాసనసభ కార్యదర్శికి లేఖ రాసారు.
నిరసన ప్రకటించే సమయంలో రాణులు అలంకరణలేమీ లేకుండా ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఎవరికీ కనిపించకుండా ఏకాంత అలక కక్షలో ఉండేవారు. ఆ సంగతి తెలిసిన రాజుగారు రాణి ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసేవారు.
బహిరంగ స్థలాల్లో చెయ్యగూడదు, ట్రాఫిక్ కి కానీ జనసామాన్యానికి కానీ ఆటంకం కలిగించగూడదు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఎక్కడ చెయ్యాలి. శాంతి భద్రతలకు లోపమంటూ సెక్షన్ 144 లాంటి నియమాలను విధించితే బయట ఎక్కడా చెయ్యలేరు. నగరానికి బయట ఎక్కడో రిసార్ట్ లలోనో లేకపోతే ఫామ్ హౌస్ లలోనో చెయ్యాలి. అప్పుడెవరూ పట్టించుకోరు. నిరసనలు చేసేదే సమస్యను అందరి దృష్టికీ తేవాలని కాబట్టి అందరి దృష్టీ పడేచోటే నిరసనలు చేపడతారు.
లేదంటే, వివాహాది శుభకార్యాలకు అద్దెకు ఇస్తున్నట్టుగా నిరసన గృహాలను కూడా నగరాల్లో నిర్మించాల్సి వస్తుంది. అందులో ముందే మీడియా వాళ్ళు కలియ తిరుగుతూ కవర్ చెయ్యటానికి వీలుగా, పోలీసులు వచ్చి భంగం చెయ్యటానికి వీల్లేకుండా ఎత్తుగా సురక్షితంగా దీక్షాస్థలి, సిసి కెమేరాలతో పకడ్బందీ ఏర్పాట్లు, దీక్షలో ఉన్నవాళ్ళు కాకుండా మిగిలిన సమర్ధకులకు భోజనాది వసతులు, స్పీకర్ల ద్వారా ఎప్పుడూ సంగీతం కాకుండా పార్టీ నినాదాలు వినిపించటానికి ఆడియో ఏర్పాట్లు, బస్సులు, కార్లు, ఇతర వాహనాలతో వచ్చే వాళ్లకోసం పార్కింగ్ ప్లేస్, అత్యవసర వైద్య సదుపాయాలు, దీక్ష విరమించగానే ఇవ్వటానికి నిమ్మరసం- ఇలాంటి ఏర్పాట్లతో కూడిన దీక్షాస్థలాలు నిర్మిస్తే వచ్చే ఎన్నికలలోపులో గిరాకీ బాగానే ఉండేట్టుగా ఉంది అన్నదో చిన్న చిలిపి ఆలోచన.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more