2014 ఎన్నికల్లో పోటీ చేయటానికి తెలంగాణలో మహిళలు ఎక్కువు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చినవారే కావటం విశేషం. ఇప్పటికే తెలంగాణలోను, అటూ ఆంధ్రలోను కొంత ఇమేజ్ ను సొంత చేసుకున్న కేసిఆర్ కూతురు కవిత. 2014లో రాజకీయ నాయకురాలిగా ఎదగాలనే ఆశ ఆమెలోబలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగానే ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ఎంపీ అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందు ఉంచినట్లు తెలుస్తోంది. కూతురు కోసం కేసిఆర్ రెండు నియోజక వర్గాలను రెఢీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ జాగ్రుతి పేరుతో కవిత సొంత ఇమేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెరాసకు మెజార్టీ సీట్లే వస్తాయని అందరూ భావిస్తున్నారు. దీంతో 2014 ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ ఆరంగేట్రం చేయాలని కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు. అందుకు జనగామ నియోజకవర్గం బాగుంటుందని ఆమె భావిస్తున్నారట. ప్రస్తుతం జనగామ నియోకవర్గ ఇంఛార్జ్ టిక్కెట్ ఆశిస్తున్నారు. తెరాస అధినేత ఆయనను బుజ్జగించి కూతురుకు ఇస్తారా లేదా అనేది చూడాలి. జనగామ నుండి వీలుకాని పక్షంలో నిజామాబాద్ నుండి పోటీ చేయాలని కవిత భావిస్తున్నారట.
అయితే ఇక్కడే కవితకు మరో చిక్కుమూడి పడింది. కవితకు పోటీగా కాంగ్రెస్ మంత్రి కోడలు పోటీ చేయ్యటానికి సిద్దంగా ఉందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు మంత్రి పొన్నాల లక్ష్మయ్య వచ్చే ఎన్నికల్లో జనగామ బరిలో దిగిందుకు ఆసక్తి కనబర్చడం లేదట. కిందటిసారి చావుతప్పి కన్నులొట్టబోయి గెలిచిన పొన్నాలకు గెలిచిన సంతోషం కూడా లేదనే చెప్పవచ్చు. ఆయన గెలుపు పైన ప్రత్యర్థి అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. మరోవైపు ఊపందుకున్న తెలంగాణవాదం. ఈ నేపథ్యంలో మరోసారి ఇక్కడి నుండి పోటీ చేసేందుకు ఆయన పెద్దగా ఇష్టం చూపడం లేదనేది టాక్. అయితే, ఆయనకు బదులు ఆయన కోడలు పొన్నాల వైశాలి బరిలోకి దిగవచ్చునని అంటున్నారు.
ఆయన తప్పుకుంటే వైశాలికే టిక్కెట్ ఖాయమంటున్నారు. ఇప్పటికే ఆమె తాను లేదా తన మామ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. పొన్నాల ఆసక్తి చూపని నేపథ్యంలో ఆమె పోటీ చేయవచ్చు. దీంతో జనగామ నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో ఆసక్తికరంగా మారనుంది. ఇద్దరి మహిళల మధ్య పోరు జరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మిగిలిన మూడు రాజకీయ పార్టీలు కూడా ఈ ఇద్దరిపై మహిళలనే పోటీకి సిద్దం చేసుకోవాల్సి వస్తుందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే జనగామ బరిలోకి మహిళలు దిగితే.. గెలుపు ఏ పార్టీ వారిని వరిస్తుందో 2014 ఎన్నికల్లో చూడాలి. అప్పటి వరకు ఏ మహిళల పేరు ఏ రాజకీయ పార్టీలోకి మారుతుందో వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more