హైద్రాబాద్ కి 200 కి.మీ దూరంలో వరంగల్ జిల్లాలోని గంగదేవి పల్లి గ్రామం ఎన్నో విషయాల్లో మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచింది. విదేశాల నుంచి కూడా గుర్తింపు పొందింది. ఏమిటక్కడి విశేషం అంటే,
ఒకటి కాదు. సర్వతోముఖమైన అభివృద్ధిని సాధించిందీ గ్రామం. ఆరోగ్యం పారిశుద్ధ్యంలో నిర్మల గ్రామ్ పురస్కార్ తో సహా ఎన్నో పురస్కారాలను పొందింది. గ్రామంలో 24 కమిటీలున్నాయి. అవన్నీ విడివిడిగా పారిశుద్ధ్యం, త్రాగు నీరు, కేబుల్ టివి, విద్య లాంటి ప్రణాళికలను నిర్వహిస్తుంటాయి.
విద్య- 1300 గడప ఉన్న ఈ గ్రామంలో వయోవృద్ధులతో సహా 100 శాతం విద్యావంతులు. 15 సంవత్సరాలుగా స్కూల్ డ్రాపౌట్లు అసలు లేరు.
పబ్లిక్ సౌకర్యాలు- విద్యుత్, నీటి సరఫరా- మామూలుగా ఉండే నీటి సరఫరాతో పాటుగా గ్రామంలో శాస్త్రీయమైన నీటి ఫిల్టరేషన్ ప్లాంటు ఉంది. గ్రామం నడుపుకుంటున్న కేబుల్ టివి, రోడ్లన్నీ సిమెంటుతో చేసినవి, అన్ని రోడ్లకీ దీపాలతో శోభాయమానంగా ఉంటాయి.
ఆరోగ్యం- శిశు మరణాలు అసలు లేవు. శిశువులకు అవసరమైన టీకాలు, రోగనిరోధక మందులను సక్రమంగా తీసుకుంటారు. శిశువులకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, సకాలంలో ఆరోగ్య పరీక్షణలు జరుగుతుంటాయి.
జనాభా నియంత్రణ- గ్రామంలో 35 సంవత్సరాల లోపులో ఉన్నవారికి ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ లేరు.
మహిళా ఆర్థిక స్వాతంత్ర్యం- గ్రామంలో స్త్రీ పురుషుల సంఖ్యలో వ్యత్యాసం లేదు. ప్రతి మహిళా స్వయం ఉపాధిలో భాగం వహిస్తూ కుటుంబ ఆదాయంలో పాలు పంచుకుంటారు.
పొదుపు- ప్రతి మనిషికీ కనీసం 10000 రూపాయలు సేవింగ్స్ లో ఉంటాయి. అందరూ బీమా చేయించుకున్నవారే. దానితో బీమాగ్రామ్ పురస్కారం కూడా గ్రామానికి వచ్చేసింది.
వ్యవసాయం- వ్యవసాయంలో అభివృద్దికి పాటుపడే కమిటీ ఎప్పుడూ ఉత్పత్తిని పెంచుతూ వ్యవసాయ ఖర్చులను ఎలా తగ్గించాలా అని చూస్తుంది.
రైతులకు ఋణాలు- రైతుల ఋణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రాష్ట్రంలోని రైతులంతా అందుకు సంతోషించారు. కానీ ఈ గ్రామవాసులు అప్పటికే వారి వాయిదాలు వాళ్ళు ఠంచన్ గా కట్టేసారు. అలా కట్టిన మొత్తం 40 లక్షల రూపాయలు.
న్యాయ సలహాలు- కుటంబాలలో కీచులాటలు సామాన్యమే. కానీ సకాలంలో వాటిని పరిష్కరిస్తే వాటి కొనసాగింపు ఉండదు కాబట్టి గ్రామంలోని ఒక కమిటీ వాటి సంగతి చూసుకుంటుంది.
అవినీతి నిరోధకం- రేషన్ దుకాణాలలో అవినీతికి తావివ్వకుండా సివిల్ సప్లై లను నిర్వహించే కమిటీ ఒకటుంది.
మద్యపాన నిషేధం- మద్యం అమ్మకాలు ఈ గ్రామంలో పూర్తిగా నిషేధించబడ్డాయి. దానికో కమిటీ ఉంది. తాగుడు వలన ఇంటికీ వంటికీ సమాజంలో సామరస్యానికీ అన్నిటికీ నష్టమే కాబట్టి మద్యాన్ని పూర్తిగా నిషేధించారు.
గ్రామంలో ప్రత్యేక ఆదాయం- గ్రామం ప్రసిద్ధికెక్కటంతో గ్రామాన్ని చూడటానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైందట. గ్రామ సంక్షేమమే ముఖ్యం కాబట్టి, అలా వచ్చే వాళ్ళని గ్రామంలో తిప్పుతూ అన్నీ చూపించటానికి వాళ్ళు ప్రతి సందర్శకుడి దగ్గరా 1600 రూపాయలను ఛార్జ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు వారానికి ఇద్దరు ముగ్గురు వస్తుంటారని చెప్పారు.
గ్రామాభివృద్ధి వెనక- ఈ స్థితికి తీసుకుని రావటానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఎన్నో అడ్డంకులను దాటి గ్రామాన్ని ఇలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోగలిగామని అక్కడి కమిటీ వాళ్ళు చెప్పారు. గ్రామంలో ఉన్న ఐకమత్యం, సమాజాభివృద్ధి అవసరమని గ్రహించటం వలనే అంతా సాధ్యమైందని బాల వికాస సోషల్ సర్వీస్ సోసైటీ కి చెందిన సభ్యులు ఎస్.ఎస్.రెడ్డి అన్నారు. ఇది ఎన్ జి వో సంస్థ. ఆ సంస్థ గ్రామాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more