Cm kiran ratifies polavaram tenders to transstroy

chief minister n kiran kumar reddy, polavaram project, mid night, transstroy (india) ltd, minister rayapati sambasivara rao, cm kiran green signal for polavaram tenders

cm kiran ratifies polavaram tenders to transstroy

cm-kiran.gif

Posted: 03/04/2013 12:40 PM IST
Cm kiran ratifies polavaram tenders to transstroy

cm kiran ratifies polavaram tenders to transstroy

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  తమ పార్టీ నాయకులకు అర్థరాత్రి వరాలు ఇస్తున్నాడు.  వివాదం, విమర్శలతో  పెండింగ్ పడుతున్న పోలవరం ప్రాజెక్టు ను .. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన రాయపాటికి అర్థరాత్రి వరం ఇచ్చారని రాజకీయ పార్టీల నాయకులు అంటున్నారు. మొత్తానికి పోలవరం టెండర్లు ట్రాన్స్‌ట్రాయ్‌కే ఇచ్చేశారు. అన్ని వివాదాలను, ఇతర టెండర్ సంస్థల హెచ్చరికలను పక్కనపెట్టి ట్రాన్స్‌ట్రాయ్‌కే టెండర్లు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదముద్ర వేశారు. వెనువెంటనే ట్రాన్స్‌ట్రాయ్, పోలవరం ఇంజనీర్ల మధ్య ప్రాజెక్టు నిర్మాణ పనులపై ధవళేశ్వరంలో ఒప్పందం జరిగింది. పనులను 2016 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో పేర్కొన్న మార్గదర్శకాల ఆధారంగానే ప్రాజెక్టు పనులను ట్రాన్స్‌ట్రాయ్ జాయింట్ వెంచర్ సంస్థ నిర్వహించాల్సి ఉంటుంది. పనుల నిర్వహణను పర్యవేక్షించేందుకు ముగ్గురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో జల నిపుణుడు, నిక్కచ్చి అధికారిగా గుర్తింపు పొందిన సీతాపతిరావుకు స్థానం కల్పిస్తున్నట్టు సమాచారం. అలాగే ఇతర సంస్థల నుంచి కోర్టు కేసులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అడ్వకేట్ జనరల్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

cm kiran ratifies polavaram tenders to transstroy

అలాగే వారంలోగా పోలవరం పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. 4717 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పోలవరం స్పిల్‌వే, ఎర్త్ పనులు, రాక్‌ఫిల్ డ్యామ్, విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు టెండర్లు దాఖలు చేసినప్పటి నుంచి వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం తొలిసారి జారీచేసిన నోటిఫికేషన్‌లో ష్యూ సంస్థ ఎల్-1గా అవతరించి టెండర్లు ఖరారు చేసుకోగా, ఆ సంస్థతో భాగస్వామిగా ఉన్న పటేల్ సంస్థ బ్లాక్ లిస్టులో ఉండటంతో ఆ సంస్థకు టెండర్లు తిరస్కరించారు. అనంతరం ఎల్-2గా ఉన్న సోమా సంస్థకు టెండర్లు ఖరారు చేశారు. ఈ సమయంలో మిగిలిన మధుకాన్, ట్రాన్స్‌ట్రాయ్ వంటి సంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో వారి టెండర్లను కూడా పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  టెండర్లు దాఖలు చేసిన ఎల్-1గా తెరపైకి వచ్చింది. అయితే ఈ సంస్థపైనా ఆరోపణలు రావడం, ఆ సంస్థతో రష్యాలో భాగస్వామిగా ఉన్న యుఇఎస్ సంస్థ చేసినట్టు పేర్కొన్న పనులపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇంజనీర్లతో కూడిన బృందాన్ని రష్యాకి పంపించడం, వారు ట్రాన్స్‌ట్రాయ్ భాగస్వామ్య సంస్థ దాఖలు చేసిన పత్రాలు సక్రమంగానే ఉన్నట్టు నిర్థారించడంతో ఎల్-1గా ఉన్న ట్రాన్స్‌ట్రాయ్‌కే టెండర్లు ఖరారు చేసేందుకు నిర్ణయించారు. గత వారం రోజులుగా విస్తృతంగా ఈ అంశంపై చర్చించిన అధికారులు కీలక నిర్ణయం తీసుకోవడంలో సతమతమైనప్పటికీ ట్రాన్స్‌ట్రాయ్‌కే టెండర్లు ఖరారు చేయాలని హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఆమోద ముద్ర వేయడంతో చకచకా ఒప్పందాలు జరిగిపోయాయి. ఇలా ఉండగా, ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ దాఖలు చేసిన పత్రాలపై రష్యా వెళ్లివచ్చిన బృందం సరైన నివేదిక ఇవ్వలేదంటూ సోమా సంస్థ దాఖలు చేసిన అభ్యంతరాలను కూడా హైపవర్ కమిటీ నిశితంగా చర్చించింది. అయితే ఈ అభ్యంతరాలను పక్కనపెట్టి ట్రాన్స్‌ట్రాయ్‌కే పోలవరం కట్టబెట్టాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ట్రాన్స్‌ట్రాయ్‌కి టెండర్లు కేటాయిస్తే కోర్టుకు వెళ్తామని సోమా సంస్థ హెచ్చరించింది. ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందం కూడా జరిగిపోవడంతో సోమా సంస్థ ఎటువంటి అడుగు వేస్తుందో చూడాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna wrong step in bollywood
Media wants big bang news comments chidambaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more