మీడియాకు కావలసింది షాకింగ్ న్యూస్ అంటూ మీడియా మీద నవ్వుతూ వ్యాఖ్యానించారు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం. ఈ రోజు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిదంబరం 2013-14 బడ్జెట్ మీద మరి కొన్ని విషయాలను ప్రస్తావించారు. రాజ్యసభకు సంబంధించని కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్, ఇన్సూరెన్స్, బ్యాంకుల అభివృద్ధికి చెందిన విషయాలను పార్లమెంటులో వివరిస్తామన్నారు. ఫిబ్రవరి 28 న రాజ్య సభలో ప్రవేశపెట్టింది స్థూలరూపంలోని అంచనాలు మాత్రమే అన్నారాయన. ఆర్థిక బడ్జెట్ మీద పార్లమెంటులో జరిగే చర్చల్లో, దానిమీద వచ్చే ప్రశ్నల సమయంలో మరికొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుందని చిదంబరం చెప్పారు.
తను రూపొందించిన బడ్జెట్ తో తనకు సంతృప్తిగా ఉందని, దేశంలో ఆర్థికాభివృద్ధికది దోహదం చేస్తుందని చెప్తూ, కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం తనతో ఏకీభవిస్తోంది కానీ ప్రతిపక్షం విమర్శిసతూ తనపని తాను చేసుకుపోతోందని అన్నారు చిదంబరం. తప్పదు విపక్షాలు అలాగే ఉండాలి. అన్నిటికీ వ్యతిరేకిస్తూనే ఉండాలి. నాకు విమర్శలంటే భయం లేదు. మీడియా కూడా తన శైలిలో తాను పనిచేస్తుంది. కొన్ని అంశాల మీద ఎక్కువ చేసి మాట్లాడటం, కొన్నిటిని విస్మరించటం చేస్తుంటుంది ఎందుకంటే కొంత సమాచారమూ ఉండాలి, కొంత వినోదాన్ని కూడా కలిగించే పాత్రను పోషిస్తున్నారు కనుక అంటూ ప్రతిపక్షాలు, మీడియా మీద చురకలు అంటించారు.
అయితే ఇంకా బడ్జెట్లో పెద్ద షాక్ కలిగించే ప్రకటనలు ఉండబోతున్నాయా అని అడిగిన ప్రశ్నకు చిదంబరం గట్టిగా నవ్వుతూ, అలాంటి పెద్ద పెద్ద షాకింగ్ న్యూస్ మీ మీడియాకే ఆసక్తి కరంగా ఉంటుంది. ప్రజలు కోరుకునేవి చిన్న చిన్నవే కానీ అభివృద్ధి పథంలో పటిష్టంగా ముందుకు పోయేవి. మీడియాకి కావలసింది రక్తికట్టించే డ్రామాలు కానీ సామాన్య ప్రజానీకం కోరుకునేది క్రమబద్ధమైన జీవనశైలి, క్రమబద్ధమైన అభివృద్ధి అనే అభిప్రాయాన్ని కలిగివున్నట్టుగా చిదంబరం మాటలు సంకేతాన్నిస్తున్నాయి.
మే 2014 లో రాబోయే ఎన్నికల దృష్ట్యా ఏమైనా సంచలనాత్మకమైన ప్రకటనలు ఉంటాయి అని అడిగినదానికి చిదంబరం, ప్రభుత్వం ఎప్పుడైనా 5 బడ్జెట్లు మాత్రమే తయారు చెయ్యగలుగుతుంది, యుపియే కి ఇది ఐదవది. దీని ఫలితం మీకు వచ్చే సంవత్సరం కనిపిస్తుంది, దాని తర్వాత ఎన్నికలొస్తాయి అన్నారాయన. ఆర్థికాభివృద్ధికి తగిన ప్రకటనలు వస్తాయని మాత్రం చెప్పారాయన. పన్నులు ఎగవేసేవారి పట్ల కఠినంగా ప్రవర్తిస్తామని హెచ్చరిస్తూ, ప్రకటించిన మహిళా బ్యాంకులు నవంబరు నుంచి ప్రారంభమౌతాయని అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more