యూపీఏ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతాపార్టీతో పాటుగా అధికార కూటమి- మిత్రపక్షాలు విమర్శించాయి. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ - వ్యవసాయం మొదలు పొరుగుదేశాలతో సంబంధాల వరకూ ప్రభుత్వం వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ధరల పెరుగుదల, జాతీయ భద్రత, అవినీతి - ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ప్రభుత్వ వైఫల్యమే కనిపిస్తోందని ఆయన విమర్శల వర్షం కురిపించారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలోనూ యూపీఏ ప్రభుత్వం మోసానికి పాల్పడుతోందని రాజ్నాథ్సింగ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొస్తే బీజేపీ సంపూర్ణ మద్దతిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. యూపీఏ ప్రభుత్వం ఇవ్వకపోతే, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.రాష్టప్రతి ప్రసంగం ద్వారా యూపీఏ ప్రభుత్వం 2014 సార్వత్రిక ఎన్నికల అజెండాను ముందుంచే ప్రయత్నం చేసిందికానీ, ప్రభుత్వానికి దిశానిర్దేశం, దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించే నైతిక స్థైర్యం లేవని బీజేపీ అధ్యక్షుడు పేర్కొన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్నసంక్షోభా లన్నింటికీ యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలు, ఆర్థిక ప్రణాళికలు, అవినీతి కారణమని రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు. రాష్టప్రతి ప్రసంగం ద్వారా ప్రభుత్వం ప్రజల్లో భ్రమల్ని సృష్టించే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు.కాగా, ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా ప్రజలపై అదనపు భారం మోపే విధంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ధరలను అదుపుచేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ములాయం భగ్గుమన్నారు. కాగా, అంతకు ముందు ధన్యవాదాల తీర్మానంపై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు పీసీ చాకో ప్రభుత్వాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం విధాన పక్షవాతంతో కొట్టుమిట్టాడుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణల్ని ఖండించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more