నగరంలోని దిల్సుఖ్నగర్లో ఈ రోజు సాయంత్రం రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం చెందగా మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంకటాద్రి, కోణార్క్ థియేటర్లలో జంట పేలుళ్లు జరిగినట్లు తెలియవచ్చింది. పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ సమయంలో తొక్కిలాట జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వరుస పేలుళ్లతో అప్రమత్తమైన పోలీసులు నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. అత్యంత రద్దీ ప్రాంతమైన దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలుడుతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో స్థానికులు కకావికలమై పరుగులు పెట్టారు.
అయితే బాంబును పోలీసులు గుర్తించారు. పేలుళ్లతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలంలో బాబు నిర్వీర్యదళంతో గాలింపు చర్యలు చేపట్టారు. వెంకట్రాది ధియేటర్ సమీపంలో ఒక బాంబును పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ సంఘటనతో నగరంలోని ప్రజలు భీతిచెంది పరుగులు తీశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. జాతీయ రహదారి కావడంతో పాటు ..హయత్ నగర్.. తదితర ప్రాంతాలకు వెళ్లే మార్గం కావడంతో దిల్ సుఖ్ నగర్ ప్రాంతం ఎప్పుడు రద్దీగా ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more