కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పై కెమెరా కన్నుతో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అదీ కూడా ఎవరు కాదు. మన దేశ ప్రధాని మంత్రేనట. ప్రధాని మంత్రి అంటే ఇప్పుడున్న ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ కాదులేండి. ఆయన ఇప్పుడు బతికిలేడు. దివంగత మాజీ ప్రధానిగా ప్రమోషన్ మీద పైకి పోవటం జరిగింది. ఒక తెలుగు నాయకుడే సోనియా గాంధీ పై నిఘాపెట్టినట్లు తెలుస్తోంది. అదే తెలుసుకున్న సోనియా గాంధీ ఆగ్రహంతో ఊగిపోయినట్లు తెలుస్తోంది. ఆయన చనిపోయిన తరువాత కూడా ఆమె ఆగ్రహం చల్లబడలేదట. అంతేకాదు.. ఆ అపర మేధావి శవాన్ని కూడా ఏఐసీసీ కార్యాలయం ఛాయలకు కూడా రానివ్వలేదనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు సోనియా గాంధీ మీద ఆయన ఎందుకు నిఘా పెట్టినట్లు? అంత అవసరం ఏమిటి? అనే అనుమాలు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు, దేశ ప్రజలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఢిఎన్ఏ అనే ఇంగ్లీష్ పత్రిక వాసిన కథనం ప్రకారం అయితే ఇలా ఉంది. రాజీవ్ గాంధీ దుర్మరణం తర్వాత సోనియా గాంధీ ససేమిరా అన్నారు. పార్టీకి దూరంగా ఉన్నారు.
ఆ సమయంలో పీవీ నరసింహారావును ప్రధాని పదవి వరించింది. ఆయన ఒక సందర్భంలో పూర్ లేడి అని సోనియా గాంధీ పై సానుభూతితో కూడిన వ్యాఖ్య చేయటం జరిగిందట. అయితే కొంతమంది ఈ విషయాన్ని ఆమె చెవిలో వేయటంతో .. పీవీపై కోపం పెంచుకోవటానికి ఇదే మొదటి కారణమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో పీవీ ప్రధానిగా ఉన్నప్పటికి.. పార్టీలో సోనియా మరో అధికార కేంద్రంగా మారుతున్నారనే ఆందోళన పీవీని వెంటాడేది. పీవీ సోనియా మధ్య అంతరం పెరుగుతూ రావటం జరిగిందట. ఈ సమయంలో సోనియా గాంధీ బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. సహజంగానే.. ఆమె బ్రిటన్ కు ఎందుకు వెళ్లారు? ఎవరిని కలుస్తున్నారు? రాజకీయపరమైన మద్దతు ఏదైనా కూడగడుతున్నారా? వంటి అనేక సందేహాలు ప్రధానిగా ఉన్న పీవి నరసింహరావులో తలెత్తాయి. ఈ సందేశాలకు సమాధానాలు కనుగొనేందుకే.. సోనియా కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
బ్రిటన్ లో ప్రముఖ వ్యాపారి అయిన వుల్ప్ గ్యాంగ్ రిచ ర్డ్స్ తో ఇందిరా గాంధీ కాలం నుంచే కాంగ్రెస్ తో సన్నిహిత సంబంధాలున్నాయిట. అటు కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటూనే.. ఇటు బ్రిటన్ లో మన భారత నిఘా వర్గాలు కోరిన సమాచారాన్ని సేకరించి పెట్టే వారని సినీయర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బ్రిటన్ లో సోనియా కదలికలపై ఆరాతీసే బాద్యతను భారత నిఘా విభాగం ..‘రా’ వుల్ప్ గ్యాంగ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సోనియాగాంధీ పీవీ నరసింహరావు పై మరింత ఆగ్రహం పెంచుకోవటం జరిగిందని ఇంగ్లీస్ పత్రిక రాయటం జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more