మన రాష్ట్ర మఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మొట్ట మొదటి సారిగా రాహుల్ గాంధీ తో తెలంగాణ విషయం మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు పీసీసీ బొత్స సత్యనారాయణ కూడా తెలంగాణ గురించి రాహుల్ గాంధీకి వివరించి చెప్పినట్లు సమాచారం. అయితే తెలంగాణపై తుది నిర్ణయం వెలువడేందుకు మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణను త్వరగా తేల్చేయాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు మహారాష్ట్ర సిఎం ఫృధ్వీరాజ్ చౌహాన్, పశ్చిమ బెంగాల్ పిసిసి నేత అభ్యంతరాలు వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. ప్రత్యేక తెలంగాణను ప్రకటిస్తే విదర్భ ఏర్పాటునూ చేపట్టాల్సి ఉంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్, గూర్కాలాండ్ డిమాండ్ను తప్పించుకోవటం కష్టమని పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు తేల్చిచెప్పారు. ఉత్తరప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అప్పటి ముఖ్యమంత్రి మాయావతి చేసిన ప్రతిపాదనకు ప్రజా వ్యతిరేకత ఎదురయ్యే ఆమె ఘోర పరాజయం పాలయ్యారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వీరు కరాఖంఢిగా తెలియ చేసినట్టు తెలిసింది. తెలంగాణను ప్రకటించిన మరు క్షణంలో దేశం మొత్తంమీద చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నందున ఈ అంశంపై ఆచితూచి వ్యవహరించాలని నేతలు రాహుల్కు తెలియచేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణను ప్రకటించిన పక్షంలో తెలంగాణలో ఆశించిన ఫలితాలు దక్కుతాయా? తెలంగాణలో ఘన విజయం సాధించి తీరుతామని టి.కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు ఎంతవరకూ నిజం? అన్న విషయాలపై హైకమాండ్ ముఖ్యంగా రాహుల్గాంధీ సొంత వేగులతో కచ్చితమైన వివరాలు తెప్పించుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాతే తెలంగాణపై తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కాంగ్రెస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. ప్రత్యేక తెలంగాణకు తప్పించి ఇతర ప్రత్యామ్నాయాలకు అంగీకరించే ప్రసక్తి లేదని తెలంగాణ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా మాత్రమే తాము రాహుల్కు సూచించామని, ఈ విషయంపై ఆయన మనోభావాలు గురించి తెలియదని ముఖ్యమంత్రి కిరణ్ స్పష్టం చేశారు. హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని తెల్చటంతోపాటు, రాష్ట్రానికి విడుదల చేయాల్సిన గ్యాస్ను కేజి బేసిన్ నుంచి విడుదల చేయించాల్సిందిగా రాహుల్ను కోరినట్టు ముఖ్యమంత్రి కిరణ్ చెప్పారు
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more