ప్రపంచంలో అన్ని దేశలలో ఒక్కటే సమస్య వేదిస్తుంది. ఏ దేశంలో చూసిన స్థూలకాయులు పెరిగిపోతున్నారు. ఇలా పెరిగి పోవటం వలన భూమి పై అధిక భారం పడుతుందని కొంత మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మారుతున్న కాలంతో పాటు మనవుడిలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ జనాభ ప్రతి సంవత్సరం విపరీతంగా పెరిగిపోతున్నారు. అధిక జనాభతో నిండి దేశంగా చైనా పేరు తెచ్చుకుంది. తరువాత స్థానంలో ఇండియా పేరు నమోదు అయ్యింది. కానీ మనవుడిలో వస్తున్న మార్పుల ద్రుష్ట్యా రాబోయే ప్రమాధాలు , విపత్తుల గురించి శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మనవుడి ఆహార పద్దతుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల వలన మనవుడి జీవితం కాలంలో చాలా వరకు తగ్గిపోయింది. ఎంత వేగంగా మనవుడు ఎదుగుతున్నాడో , అంతే వేగంగా మనవుడు అనారోగ్యానికి గురవుతున్నారు. మనవుడు తినే ఆహారం వలన అనేక రోగాలతో మనిషి సతమతమవుతున్నాడు. ప్రక్రుతి లో వస్తున్న పెను మార్పులను మనిషి గుర్తించలేక పోతున్నాడు. ఇప్పుడు ఒకే ఇంటిలో ముగ్గురు, లేదా నలుగురు స్ధూలకాయంతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఇప్పుడు ప్రపంచమంత ఉన్నదే. అయితే దీనిపై అనేక మంది అనేక రకాలుగా చెబుతున్నారు. తినే ఆహారంలో చక్కెర పదార్ధాలు ఎక్కువుగా ఉంటే అది స్ధూలకాయానికి దారి తీస్తుందని అమెరికాకు చెందిన ప్రముఖ స్థూలకాయ చికిత్స నిపుణులు రాబర్డ్ లస్టిగ్ తెలిపారు.
చక్కెర వల్ల లెప్టిన్ అనే హార్మోన్ కు సబంధించి అసమతుల్యత ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. శరీరంలోని ఆకలిని నియంత్రించే హర్మోన్లు రెండు ఉంటాయి. ఒకటి, లెప్టిన్ కాగా మరొకటి గ్రెలిన్. లెప్టిన్ ఆకలిని మందగింపజేస్తే.. గ్రెలిన్ దానికి వ్యతిరేకంగా ఆకలిని పెంచుతుంది. మనం ఆహారం తినేటప్పుడు కొంత సమయం తర్వాత కడుపు నిండినట్టు అనిపించి, ఆ తర్వాత ఇక ఆహారం తినకపోవడానికి కారణం లెప్టిన్ నుంచి మెదడుకు అందే సంకేతాలే. అధిక బరువుతో సమతమయ్యేవారిలో లెప్టిన్ చాలా ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. దాని నుంచి వెలువడే సంకేతాలను వారి మెదడు కణాలు గుర్తించడం లేదని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. దీనివల్ల వారికి పొట్ట నిండిన విషయం తెలియక అవసరమైన దానికన్నా ఎక్కువుగా తింటుంటారు. ఈ అంశంపై రాబర్డ్ లస్టిగ్ పరిశోధనలు జరిపారు. చక్కెర పదార్ధాలను ఎక్కువగా తీసుకునే వారిలో లెప్టిన్ నిరోధకత పెరిగిపోతోందని ఇదే క్రమంగా స్థూలకాయానికి దారి తీస్తుందని గుర్తించారు. దీనిని వైద్యపరంగా ఇన్సులిన్ ను తగ్గించే ఔషదాల ద్వారా నియంత్రించవచ్చని.. అయితే దీని కన్నా ఆహారంలో చక్కెర పదార్ధాలు ఎక్కువుగా లేకుండా చేసుకోవటం సులభమైన మార్గమని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more