కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. జిల్లాలోని వీర్లపల్లిలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. వైకాపా నేతలు జైలు నుంచే రాజకీయాలు నడుపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైకాపా నేతల వద్ద టన్నులకొద్ది డబ్బులు ఉన్నాయని, వారు ఎమ్మెల్యేలకు ప్రత్యేక ప్యాకేజీలు ఎర చూపి కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విలువల్లేని రాజకీయాలతో ఎవరైనా పార్టీ మారితే వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ విలువలకు కట్టుబడి ఉండే టీడీపీ ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో ఉద్యమిస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల కాంగ్రెస్ సర్కారుకు నూకలు చెల్లాయని ఆయన అన్నారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, గల్లీగల్లీకి వెళ్లి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై వివరించాలని ఆయన కోరారు. కాంగ్రెస్తో లీనమయ్యే పార్టీలకు టీడీపీని విమర్శించే స్థాయి లేదని ఆయన స్పష్టం చేశారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.వచ్చే ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తెలిపారు. పార్టీ కోసం తానొక్కడినే పని చేస్తే సరిపోదని, సమష్టిగా పని చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. తాను రోడ్డున పడి నడుస్తున్నానని, ఆ సీరియస్నెస్ పార్టీ నేతల్లో లేదని ఆయన తెలిపారు. ఇన్ఛార్జిలు అలంకారప్రాయంగా ఉండరాదని ఆయన సూచించారు.
తానొక్కడినే కష్టపడితే కాదు..అందరు కష్టపడితేనే ప్రతిపలం ఉంటుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా ఉంది. పార్టీలో ప్రతి ఒక్కరు శ్రమించవలసిన సమయమిదని ఆయన పార్టీ నాయకులకు కర్తవ్యబోద చేయడానికి ప్రయత్నించారు.రంగారెడ్డి జిల్లా వీర్లపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్ ఛార్జీలు ఆయాచోట్ల అలంకార ప్రాయంగా ఉంటున్నారని, అది సరికాదని కూడా చంద్రబాబు అన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని , మనపార్టీ నేతలు కొందరిలో సీరియస్ నెస్ కనిపించడం లేదని , ఇతర పార్టీలు హడావుడి పడుతున్న విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు.నేతలు విభేదాలను వీడి పనిచేయవలసిన అవసరం ఉందని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. పాదయాత్రతో ఎంతో శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడుకు కొందరు నేతలపై వస్తున్న నివేదికలు ఆందోళన కలిగించి ఉంటాయి. పార్టీ నేతలు క్రియాశీలకంగా లేకపోతే జరిగే నష్టాన్ని, ఇతర పార్టీలను ఎదుర్కోవడానికి ఎంత కష్టపడాలన్నదానిపై పార్టీ క్యాడర్ కు ఆయన హితబోధ చేశారని భావించాలి
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more