కలెక్షన్ కింగ్ కు మళ్లీ కోపం వచ్చింది. ఈసారి ఏకంగా బ్రాహ్మణులపై కామెంట్ చేయటం విశేషం.మంచు వారికి ఈ సంవత్సరంలో ఆర్థికంగా అనేక దెబ్బలు తగిలాయి. డాక్టర్ మోహన్ బాబు కొడుకులు తీసిన సినిమా 2012 లో పెద్ద విజయం సాధించాలేదు. అయితే చివరకు ‘దేనికైన రెఢీ’ తీసిన సినిమా కొంచెం మంచు కుటుంబంలో ఆనందం నింపింది. ఆ ఆనందం పై నీళ్లు చల్లటానికి బ్రాహ్మణులు రెఢీ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బ్రాహ్మణుల్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నయాంటు మోహన్ బాబు ఇంటి ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అయితే ఈ బ్రాహ్మణులపై ఆ చిత్ర నిర్మాత అయిన నటుడు మోహన్ బాబు ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ‘ నా ఇంటి ముందు ధర్నా చేసే బ్రాహ్మణులంత కిరాయి బ్రాహ్మణులే అని మోహన్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది. వేదం చదివిన బ్రాహ్మణలెవరు ‘దేనికైనా రెఢీ’ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచామని అనుకోరని మోహన్ బాబు అంటున్నారు. మోహన్ బాబు ఆయన కుమారుడు నెల్లూరు జిల్లాలోని సూళ్లురు పేటలో చెంగాళ్లమ్మ అమ్మవారి దర్శనం కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తన ఇంటి ముందు బ్రాహ్మణులు ధర్నా చేసిన విషయాన్ని తెలుసుకోవటం జరిగింది. అయితే ఆ సమయంలో ఆయన నా ఇంటి ముందు ధర్నా చేశారా? నాకు తెలీదే .. వారు నిజమైన బ్రాహ్మణులై ఉండరు అని చెప్పటం జరిగిందని మీడియా వారు అంటున్నారు. నేను ఉండుంటే చందా ఇచ్చి పంపేవాణ్ని అని మోహన్ బాబు మాట్లాడినట్లు మీడియా వారు అంటున్నారు. అయితే చివరిగా తనకు అన్ని కులాలు ఒక్కటేనని ..ఎన్టీఆర్ లా తాను అన్నీ కులాలనూ ప్రేమిస్తానని మోహన్ బాబు చెప్పినట్లు మీడియా వారు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more