ఉప ఎన్నికలు జరుగుతున్నందున ఎవరైనా కులమతాల గురించి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ హెచ్చరించారు. సచివాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదుపై ఆయన స్పందించారు. తమకు క్షేత్రస్థాయి నుంచి సమాచారం వస్తోందని, సీఎం పర్యటన సందర్భంగా గుడిలో బ్యానర్లు కట్టిన ఆధారాలు తమకు వచ్చాయని తెలిపారు. ఎవ్వరూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించవద్దని చెప్పారు. తిరుపతి టీడీపీ అభ్యర్థి చర్చిలో ప్రార్థన చేసిన సమాచారం కూడా తమ సిబ్బంది పంపారని, ఆధారాల సేకరించే పనిలో ఉన్నామని చెప్పారు. కాగా, ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పదిమంది నోడల్ అధికారులను నియమించింది. జూన్ 12న జరగనున్న ఉప ఎన్నికల కోసం వీరికి సంపూర్ణ అధికారాలిచ్చినట్లు ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more