కాంగ్రెస్ యువనేత్రి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ పేరు చేర్చేసి...ఆనక తప్పుదిద్దుకున్నారు. యూపిలో అధికారంలో ఉన్న బిఎస్పీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆమె ధ్వమెత్తారు. ఇరవై రెండేళ్ళ కాంగ్రెసేతర పార్టీల పాలనలో ఉత్తరప్రదేశ్ వెనకబడిపోయిందని అంటూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్టల్రో అభివృద్ధి శరవేగంతో సాగుతుందని అనేశారు. ఈ మూడు రాష్ట్రాలు ప్రగతిపథంలో పయనిస్తుంటే ఉత్తరప్రదేశ్ మాత్రం ఎదుగూబొదుగూలేకుండా పోయిందని విరుచుకుపడ్డారు. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల జాబితాలో తమకు బద్ధశత్రువైన బిజెపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ పేరు అనేసి తడబడ్డారు. వెంటనే తప్పుదిద్దుకున్నారు. పొరపాటున మధ్యప్రదేశ్ పేరు చెప్పానని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. ఎంపిలో మంచి ప్రభుత్వం లేదని ప్రియాంక అంటున్నప్పుడు ఆమె ముఖం లో చిరునవ్వు కనిపించింది. ‘మధ్యప్రదేశ్లో మంచి ప్రభుత్వం లేదు. తొందర్లో తాను ఆ రాష్ట్రం పేరు పొరపాటున అనేశాను. నా ఉద్దేశం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్టల్ర అభివృద్ధి గురించి చెప్పాలని. అంతేగాని మధ్యప్రదేశ్ కాదు’ అన్నారామె. బిఎస్పీ పాలనలో ప్రజలు అష్టకష్టాల పడుతున్నారని యువనేత్రి ఆరోపించారు. కేంద్ర ఇస్తున్న నిధులు సద్వినియోగం కాలేదని ఆమె నిందించారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more