ఇస్రో వివాదం మరింత ముదిరింది. ఇద్దరు అగ్ర శాస్త్రవేత్తల మధ్య వాగ్యుద్ధానికి, పరస్పర ఆరోపణలకు దారితీసింది. తనతోపాటు మరో ముగ్గురు శాస్త్రవేత్తల పై వేటువేసిన నేపథ్యంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. ఇస్రో ప్రస్తుత చైర్మన్ రాధాకృష్ణన్పై పదునైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. నాయర్ తదితరులపై తీసుకున్న చర్యను రాధాకృష్ణన్ గట్టిగా సమర్థించుకోవడంతో వివాదం మరింత ముదిరినట్టయింది. తమపై రాధాకృష్ణన్ ఉద్దేశ పూర్వకంగానే చర్య తీసుకున్నారని, ఇప్పుడు తనకు అనుగుణంగా దాన్ని సమర్థించుకుంటున్నారని నాయర్ వ్యాఖ్యానించారు. వివాదాస్పద ఆంట్రిక్స్- డేవస్ ఒప్పందానికి సంబంధించి తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో నాయర్, మరో ముగ్గురు శాస్త్రవేత్తల పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్య తీసుకుంది. వీరు భవిష్యత్లో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి వీల్లేదని శాసించింది. అత్యంత అరుదైన ఎస్-బ్యాండ్ను ప్రైవేటు సంస్థ డేవస్కు కేటాయించడంలో ఈ నలుగురు క్రియాశీలక పాత్ర పోషించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
నాయర్- రాధాకృష్ణన్ల మధ్య రగులుకున్న వివాదం ఇస్రో శాస్త్రవేత్తల్లో తీవ్ర అశాంతిని రగిలిస్తోంది. ఈ పరిణామాల వల్ల ఇస్రో ప్రతిష్ట మంటగలిసి పోతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఓ శాస్తవ్రేత్త అయితే ‘రోదసీ ప్రయోగాల వైఫల్యం కంటే కూడా వివాదం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. కాగా ఎస్-బ్యాండ్ను డేవస్ సంస్థకు కేటాయించడం వల్ల ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందన్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని నాయర్ స్పష్టం చేశారు. అసలు ఆంట్రక్స్- డేవస్ ఒప్పందాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదన రాధాకృష్ణన్ నుంచే వచ్చిందన్నారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి తనపై చర్య తీసుకునేలా చేశారని ఆరోపించారు. అయితే నాయర్ ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నా తాను తీసుకున్న నిర్ణయంలో తప్పులేదన్న భావనతోనే రాధాకృష్ణన్ ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more