గోవాలోని అంజునా పోలీసుల నిర్లక్ష్యమే బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ హత్యకు పరోక్ష కారణమైందని నగర పోలీసులు అరోపణలు సంధించారు అమె హత్యకేసులో నిందితులుగా ఉన్న వారిలో ఇద్దరు ఉస్మానియా యూనివర్సిటీ ఠాణాలో గత నెలలో నమోదైన డ్రగ్స్ కేసులోనూ నిందితులుగా ఉన్నారని.. దీనిపై అధికారిక సమాచారం ఇచ్చినా అంజునా పోలీసులు స్పందించలేదని హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ అనంద్ పేర్కొన్నారు. ఫోగట్ హత్యకేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న పబ్ యజమాని సహా మరొకరు ఇక్కడి పోలీసులకు వాంటెడ్గా ఉన్నారని ఆయన తెలిపారు. వీరిని పీటీ వారెంట్పై హైదరాబాద్ తీసుకువస్తామని గురువారం కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
గోవాలోని అంజునా బీచ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్న ఘరానా డ్రగ్ పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ) గత నెల 17న పట్టుకుంది. ఇతడి విచారణలో అంజునా ప్రాంతానికే చెందిన స్టీవెన్, ఎడ్విన్ నూనిస్ సహా ఆరుగురి నుంచి డ్రగ్స్ దేశవ్యాప్తంగా చలామణి అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రీతీష్ను అరెస్టు చేసిన ఉస్మానియా వర్సిటీ పోలీసులు ఆ కేసులో ఆరుగురినీ నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీ సహా ఇతర వివరాలను అంజునా పోలీసులకు పంపిన హైదరాబాద్ అధికారులు వారిని అరెస్టు చేయాల్సిందిగా కోరారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్ దందాకు గోవా కేంద్రంగా నిలుస్తుందన్న వార్తల నేపథ్యంలో అక్కడి పోలీసుల వీరికి అందిస్తున్న సహకారంతోనే ఈ వ్యాపారం సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులకు చిక్కిన ఓ వ్యక్తిని ప్రశ్నించగా.. గోవా నుంచి డ్రగ్ సరఫరా అయినట్లు తేలింది. దీంతో హెచ్– న్యూ టీమ్ అక్కడకు వెళ్లి బల్క్ సప్లయర్ ఉన్న హోటల్పై దాడి చేసింది. ఫలితంగా అతడు చిక్కడంతో పాటు దాదాపు 100 గ్రాముల ఎండీఎంఏ రికవరీ అయింది. కాగా, అంజునా పోలీసులు నిందితుడిని తీసుకువెళ్లడానికి వీల్లేదని, తామే అరెస్టు చూపిస్తామని పట్టుబట్టారు. ఆపై పీటీ వారెంట్పై తీసుకువెళ్లాలని చెప్పి పంపారు. కానీ దానిపై ఇప్పటికే కేసు నమోదే కాలేదని సమాచారం.
తమకు వాంటెడ్గా ఉన్న వారిని అరెస్టు చేయడానికి వెళ్లిన హెచ్–న్యూ అధికారులు నిందితులను అరెస్టు చేసి తీసుకువెళితే కిడ్నాప్ కేసులు పెడతామంటూ గోవా పోలీసులు బెదిరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్టీవెన్, ఎడ్విన్ నూనిస్ల సమాచారాన్ని హెచ్–న్యూ గోవా పోలీసులకు అందించి అరెస్టు చేయమని కోరింది. ఎడ్విన్ అంజునా ప్రాంతంలో గ్రాండ్ లియోనీ రెసార్ట్, స్టీవెన్ హిల్ టాప్ పబ్ నిర్వహిస్తున్నారని, వీటిలో పని చేసే వారితోనే డ్రగ్స్ అమ్మిస్తున్నారని తెలిపింది. అయినప్పటికీ గోవా పోలీసులు పట్టించుకోలేదు. డ్రగ్స్ కేసులో నిందితులను అరెస్టు చేయడానికి గోవా వెళ్లిన ప్రతిసారీ నెగెటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. గోవా డ్రగ్ నెట్వర్క్పై హెచ్–న్యూకు ఉన్న సమాచారం గోవా పోలీసులకు ఎందుకు లేదంటూ అక్కడి పత్రికలూ రాస్తున్నాయి’ అని సీవీ ఆనంద్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more