స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులతో పాటు మరో భారతీయ విద్యార్థి దుర్మరణం చెందారు. స్కాట్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు తెలుగు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరుకు చెందిన మరో విద్యార్థి కూడా మృతి చెందాడు. ఉన్నత విద్య అభ్యసించేందుకని విదేశాలకు వెళ్లిన బిడ్డలు.. ఘోర రోడ్డు ప్రమాదంలో అసువులు బాసారని తెలిసి ఇక్కడ వారి తల్లిదండ్రులు. హతాశులయ్యారు. భారత ప్రభుత్వం, విదేశాంగ శాఖ అధికారులు తమ బిడ్డల పార్థీవ దేహాలను దేశానికి తరలించేందుకు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. స్కాట్లాండ్ లో ఉన్నత విద్య అభ్యసించేందుకని వెళ్లిన భారత విద్యార్థులు.. వీకెండ్ నేపథ్యంలో సమీపంలోని పర్యాటక ప్రాంతానికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. అయితే వారితో పాటు వారికి సీనియర్ అయిన సుధాకర్ అనే యువకుడు అక్కడ ఉన్నత విద్యను పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. అతనితోపాటు ముగ్గురు విద్యార్థులు ఈ నెల 19న తమ కారులో బయలుదేరి వెళ్లారు. ఇలా ప్రయాణిస్తుండగా.. అప్పిన్ ప్రాంతంలో వారి కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో భారీ వాహనాన్ని ఢీకొనింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా రక్తస్రావం కావడంతో మరణించారు. కాగా, ఒకరి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది.
హైదరాబాద్కు చెందిన పవన్ బాశెట్టి (23), నెల్లూరుకు చెందిన సుధాకర్(30)తోపాటు బెంగళూరుకు చెందిన గిరీష్ సుబ్రహ్మణ్యం(23)లు మృతి చెందారు. హైదరాబాద్లోని చంపాపేట్ కు చెందిన మరో విద్యార్థి సాయి వర్మ (24)కు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు అక్కడి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వీరిలో పవన్, సుబ్రహ్మణ్యంలు లైసెస్టర్ యూనివర్సిటీలో ఎరోనాటికల్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుధాకర్ ఇప్పటికే మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. అతని కారులోనే విద్యార్థులు కలసి బయల్దేరగా అనుకోకుండా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన సాయివర్మ కూడా ఇదే యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఈ ఘటనపై స్కాట్లాండ్ అధికారులు స్పందించారు. విద్యార్థులు వెళ్తున్న కారును భారీ వాహనం ఢీకొట్టినట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ 47 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more