ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అన్న పాట చాలా పాపులర్.. కానీ ప్రేమంటే ఇదేరా అన్న మాట కూడా చాలా పాపులర్. ఈ ప్రేమ అనే రోగం కుడితే.. చాలా వరకు ఎవరి మాట వినరు. వీరిద్దరికీ ఏ కష్టమోచ్చినా.. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్దపడతారు. అలాంటిదే ఒక ఘటన ఇది. తాను ప్రేమించిన ప్రియుడికి అరుదైన రోగం ఉందని తెలుసుకున్న ఓ ప్రియురాలు.. సమాజంలో ఏ ప్రేయసి చేయని పనిని చేసింది. తాను కూడా అరుదైన ఆ రోగం బారిన పడింది. అదెలా అంటే తన ప్రేమికుడు హెచ్ఐవీ బాధితుడని తెలిసి.. అతడితో కలిసి నడవాలని నిర్ణయించుకుంది.
అందుకు అమె.. అతడి రక్తాన్ని ఎక్కించుకుని తాను కూడా హెచ్ఐవీ బాధితురాలిగా మారింది. అసోంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. కామరూప్ జిల్లాలోని సువల్కచికి చెందిన 19 ఏళ్ల యువతికి మూడేళ్ల క్రితం ఫేస్బుక్లో పొరుగూరికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా మొగ్గతొడిగి ప్రేమగా మారింది. ఆపై ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక రోజు తాను ప్రేమిస్తున్న యువకుడు హెచ్ఐవీ బాధితుడని యువతికి తెలిసింది. అయినప్పటికీ అతడితోనే జీవితాన్ని పంచుకోవాలని భావించిన ఆమె.. మూడుసార్లు అతడితో కలిసి ఊరొదిలి వెళ్లిపోయింది.
కుటుంబ సభ్యులు వెతికి తీసుకొచ్చారు. దీంతో తాము పెళ్లి చేసుకున్నా తమను విడదీస్తారని భయపడింది. ఇకపై అలా కాకూడదంటే తాను కూడా హెచ్ఐవీ బాధితురాలిగా మారిపోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఓ రోజు అతడి రక్తాన్ని ఆమె తన శరీరంలోకి ఎక్కించుకుంది. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని అరెస్ట్ చేశారు. యువతికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో యువతి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్నట్టు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more