ఏదేని అభియోగాలపై న్యాయస్థానంలో జ్యుడీషియల్ రిమాండ్ అనుభవిస్తున్న అండర్ ట్రయల్ నిందితుడు.. బెయిల్ పై బయటకు రావాలంటే.. తప్పక న్యాయస్థానంలో దర్యాప్తు అధికారి తప్పక కోర్టులో తన వాంగ్మూలాన్ని అందించాల్సి ఉంది. అయితే ఓ విచారణ అధికారి మాత్రం నాలుగేళ్లుగా తన వాంగ్మూలాన్ని అందించకుండా ఓ నిందితుడ్ని ఏకంగా నాలుగేళ్లుగా బయటకు రాకుండా అడ్డుకోగలిగాడు. ఇలా వ్యవహరించి తన వాంగ్మూలం ఇవ్వకపోవడం కారణంగా న్యాయస్థానం అతడ్ని కోర్టుకు రమ్మని ఏకంగా 45 సమన్లు జారీ చేసింది. అంతేకాదు చివరకు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసినా ఆయన స్పందించలేదు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్గఢ్లోని సర్గుజాలో ఈ సంఘటన జరిగింది. 2018 జూలై 23న డ్రగ్స్ అమ్ముతున్న దేవేంద్ర సింగ్ను సర్గుజా పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు అతడు జైలులోనే ఉన్నాడు. నిందితుడి బెయిల్ పిటిషన్లను కింది కోర్టుతోపాటు హైకోర్టు తిరస్కరించాయి. మరోవైపు దేవేంద్ర సింగ్ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన ఎస్ఐ చేతన్ సింగ్ చంద్రకర్ ఇప్పటి వరకు కోర్టుకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వలేదు. దీని కోసం కోర్టు ఆయనకు 45 సార్లు సమన్లు జారీ చేసింది. చివరకు అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో ట్రయిల్ కోర్టులో విచారణ జరుగకపోవడంతో నిందితుడు బెయిల్ పొందలేక నాలుగేళ్లుగా జైలులోనే ఉన్నాడు.
ఈ నేపథ్యంలో నిందితుడు దేవేంద్ర సింగ్ ఈ అంశంపై తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. 45 సార్లు సమన్లు, అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పటికీ స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఎస్ఐ చేతన్ సింగ్ ట్రయిల్ కోర్టుకు రాలేదని, దీంతో తాను బెయిల్ పొందలేక నాలుగేళ్లుగా జైలులోనే ఉంటున్నట్లు ఆరోపించాడు. దీంతో హైకోర్టు నలుగురు ఐపీఎస్లకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ముగ్గురు హైకోర్టుకు హాజరుకాగా, మరొకరు రాలేదు. దీంతో ఈ అంశంపై హైకోర్టు న్యాయమూర్తి సచిన్ సింగ్ రాజ్పుత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పోలీస్ అధికారి నుంచి వివరణ కోరారు. కేసు విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more