తన కారు డ్రైవర్ హత్యాభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ను న్యాయస్థానం మరోమారు పొడిగించింది. గత మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుండటంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. డ్రైవర్ హత్యకేసులో బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించి విఫలమైన ఎమ్మెల్సీ రిమాండ్ గడువు ముగియనుండటంతో న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పరిచారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల తీరుపై మృతుడి కుటుంబీకులు మొదట్నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణ సిబిఐకు అప్పగించాలని కోరుతున్నారు. కేసు దర్యాప్తు తీరుతో పాటు, కాకినాడ ఎస్పీ వైఖరిపై బాధితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ హత్య కేసులో మిగిలిన నిందితుల్ని ఇంతవరకు పట్టుకోకపోవడం, ప్రమాదవశాత్తూ హత్య జరిగిందనే నిందితుడి వాదనకు అనుగుణంగా దర్యాప్తును ముగించే ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తు సిబిఐకు అప్పగించాలని కోరుతూ గవర్నర్కు టీడీపీ సహా ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశాయి.
మరోవైపు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు మానవ హక్కుల కమిషన్లో విచారణ జరిగింది. ఈ విచారణకు బాధిత కుటుంబసభ్యులు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుతో కలిసి హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు పోలీసులు సహకరిస్తున్నారని, పోలీసుల తీరుపై కమిషన్కు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేలా నిందితుడికి పోలీసులు అందిస్తున్న సహకారంపై ఉన్న ఆధారాలను అందచేశారు. అనంతబాబుకు సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 18న కర్నూలులో మరోసారి కమిషన్ విచారణ జరుపనుండటంతో అక్కడ జరిగే హాజరవుతామని బాధితులు తెలిపారు.
కాకినాడలో అధికార పార్టీ ఎమ్మెల్సీగా పనిచేస్తున్న అనంతబాబు తన వద్ద పనిచేసి మానేసిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి శవాన్ని మృతుడి ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోవడం ఏపీలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో మృతుడి భార్యకు ప్రభుత్వం ఉద్యగం ఇచ్చింది. హత్య కేసులో నిందితులెవరు, హత్యకు కారణాలు ఏమిటనేది మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో అనధికారిక డాన్గా చలామణీ అవుతున్న అనంతబాబుకు అధికార, ప్రతిపక్ష పార్టీలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటంతో దర్యాప్తు మీద ప్రభావం చూపుతుందని బాధితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more