మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి మహరాష్ట్ర రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ.. ఏక్ నాథ్ షిండేతో ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నావిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కాగా రేపు మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేస్తుందని సమాచారం. అయితే షిండే ప్రభుత్వానికి తాము బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించిన ఫడ్నావిస్ మధ్యాహ్నానికి సాయంత్రానికి మాట మార్చాడం గమనార్హం.
మధ్యాహ్నం దేవేంద్ర ఫడ్నావిస్ ప్రకటన తరువాత ఢిల్లీ నుంచి బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేవేంద్ర ఫడ్నావిస్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ రాత్రి జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో ఢిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. షిండే ప్రభుత్వంలో భాగం కాబోమని చెప్పిన ఆయన తన మాటను తోసిరాజుతూ భాగంగా మారారు. మొత్తానికి మహారాష్ట్రలోనూ బీహార్ మార్కు రాజకీయానికి బీజేపి తెరతీసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీహార్ లోనూ నితీష్ జేడీ(యూ) పార్టీకి ఉన్న 45 మంది ఎమ్మెల్యేలకు 77 మంది సభ్యుల బలం ఉన్న బీజేపి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.ః
ఇది ఏక్నాథ్ షిండే ప్రస్థానం.. అటో డ్రైవర్ నుంచి కెరీర్ ప్రారంభం..
ఆటో డ్రైవర్గా జీవితం ప్రారంభించిన ఆయనకు కాలం, అదృష్టం కలిసి రావడంతో ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 1964 ఫిబ్రవరి 9న మహారాష్ట్రలోని సతారాలో జన్మించిన షిండే, మరాఠా సమాజానికి చెందినవారు. ఆయన కుటుంబం జీవనోపాధి కోసం థానేకు మారింది. దీంతో ఏకనాథ్ షిండే 11వ తరగతి వరకు థానేలోని మంగళ హై స్కూల్, జూనియర్ కాలేజీలో చదివారు. అనంతరం జీవనోపాధి కోసం కూలీ పనులు చేశారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి థానేలో ఆటో నడిపారు.
కాగా, స్కూల్ స్థాయి నుంచే శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు షిండే ప్రభావితమయ్యారు. అనంతరం ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1980 ఆరంభంలో నాటి థానే శివసేన అధ్యక్షుడు ఆనంద్ దిఘేను పరిచయం చేసుకున్నారు. ఆయన మద్దతుతో శివ సైనికుడిగా ఆ పార్టీలో చేరారు. 1980లో వాగ్లే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కార్మిక నాయకుడిగా వృత్తిని ప్రారంభించారు. శివసేన ఆందోళనల్లో ముందుండే ముందుండే ఆయన, బెల్గావిపై మహారాష్ట్ర-కర్ణాటక మధ్య ఆందోళనల సమయంలో అరెస్టై 40 రోజుల పాటు జైలులో ఉన్నారు.
1997లో తొలి రాజకీయ పీఠాన్ని షిండే అధిరోహించారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. అనంతరం 2004లో కోప్రి పంచపఖాడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి వరుసగా నాలుగోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రజా సమస్యల పట్ల దూకుడుగా వ్యవహరించే వ్యక్తిగా పేరుగాంచిన షిండే శివసేనలో కీలకంగా ఎదిగారు. ముంబైకి ఆనుకుని ఉన్న థానే-పాల్ఘర్ ప్రాంతంలో కీలకమైన సేన నాయకుడిగా రాణించారు. బాలాసాహెబ్కు గట్టి మద్దతుదారుగా, ఆయన అనుచరుడిగా, శివసేన వ్యవస్థాపకుడి సిద్ధాంతాల ఉద్రేకంతో నడిచే సైనికుడిగా తనను తాను నిరూపించుకున్నారు.
ఆయన రాజకీయ గురువు ఆనంద్ డిఘే, 2001లో షిండేను థానే మున్సిపల్ కార్పొరేషన్ సభా నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ మలుపు ఆయన స్థావరమైన థానే జిల్లాను ఏకీకృతం చేయడంలో దోహదపడింది. ఆపై షిండే వెనక్కి తిరిగి చూసుకోలేదు. శివసేనలో సీనియర్గా, కీలక నేతగా, అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా, చివరకు ఆ పార్టీని చీల్చే రెబల్ నాయకుడిగా ఎదిగిన ఆయన అనంతర పరిణామాలతో ఏకంగా మహారాష్ట్రకు సీఎం అయ్యారు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు శ్రీకాంత్ ఆర్థోపెడిక్ సర్జన్. కళ్యాణ్ నుంచి రెండవసారి ఎంపీగా ఉన్నారు. కాగా, శివసేనలో అట్టడుగు స్థాయి నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన ఏక్నాథ్ షిండే ఆ పదవిలో ఎంత కాలం కొనసాగుతారు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం వ్యతిరేకతను తట్టుకుని ఎలా నిలబడతారు అన్నది ప్రశ్నగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more