అరకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు వ్యతిరేకంగా మావోయిస్టులు హెచ్చరికలు జారీచేశారు. అరకు ఎంపీ జి.మాధవి చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలకు వ్యతిరేకంగా మావోలు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులుగా శాసనసభకు, లోక్ సభకు ఎన్నికైన వీరు ప్రజలకు మేలుచేయడం మాని వైషమ్యాలను పెంచిపోషించే చర్యలను చేపడు తున్నారని మావోలు అక్షేపించారు. ఎంపీ, ఎమ్మెల్యేలను గ్రామాల్లోకి రానీయొద్దని, వస్తే తన్ని తరమాలని మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాకు లేఖ విడుదల చేశారు.
వైసీపీ ప్రభుత్వ విధానాలు యావత్తూ మోసపూరితంగా, ద్రోహపూరితంగా ఉణ్నాయని, ఈ విధానాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకించాలని అన్నారు. ఆదివాసీల ఓట్లతో ప్రజా ప్రతినిధులైన వీరిద్దరూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలన రాష్ట్రాన్ని తీవ్రమైన రుణ, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక, రాజకీయ వివాదాలు పెరిగాయని అన్నారు. దోపిడీ చేయడాన్ని కళగా మార్చుకున్న ప్రభుత్వం అందులో భాగంగానే పేర్లతో స్థానికులను సంతోషపరుస్తోందని అన్నారు.
మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లాను ఏర్పాటు చేసిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించిందని అన్నారు. ఇదంతా దేవతకు బలిచ్చే ముందు జంతువులకు చేసే పూజ లాంటిదని గణేశ్ అన్నారు. జీవో-97ను తప్పనిసరి పరిస్థితుల్లో రద్దు చేసినప్పటికీ అన్రాక్ కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని మాత్రం రద్దు చేయలేదని గుర్తు చేశారు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టాలన్న ఉద్దేశంతోనే జీవో-89ను తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీని అంతం చేయాలన్న లక్ష్యంతో గ్రేహౌండ్స్ సాయుధ బలగాలతో ప్రభుత్వం వేట కొనసాగిస్తోందని ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more