అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని సమాచారం. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మూడు రోజుల తరువాత సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యలకు అప్పగించిన ఎమ్మెల్సీ.. ఆయన ప్రమాదంలో మరణించాడని వారితో నమ్మబలికాడు. అయితే ప్రమాదమే అయితే ఆ క్షణంలోనే తమకు సమాచారం తెలిసేందని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానాలను వ్యక్తం చేశారు.
దీంతో ఈ వ్యవహారం యావత్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనంత ఉదయ్ భాస్కర్ ను కాపాడే క్రమంలో అనేక మంది వైసీపీ నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయన తప్పు ఏమీ లేదని.. అండగా నిలిచారు.ఈ క్రమంలో పోలీసులు మాత్రం ఈ కేసును హత్యకేసుగా మార్చారు. కేసును విచారించిన కాకినాడ పోలీసులు ఎమ్మెల్సీ అనంత భాస్కర్ ను అరెస్ట్ చేశారు. రహస్య ప్రదేశంలో ఆయనను విచారించారు. ప్రస్తుతం అనంత భాస్కర్ పోలీసుల కస్టడీలో ఉన్నట్టు కాకినాడ ఏఎస్పీ వెల్లడించారు. మరోవైపు, ఈ విచారణలో సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్టు ఎమ్మెల్సీ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే హత్య చేసినట్టు ఆయన తెలిపినట్టు సమాచారం. తనను బ్లాక్ మెయిల్ చేయడంతో, బెదిరిద్దామని అనుకున్నానని... కొట్టి బెదిరిద్దాం అని భావించానని చెప్పారు. అయితే తాను ఆవేశంతో కొడితే చనిపోయాడని తెలిపారు. మరోవైపు కాసేపట్లో ఆయనను జడ్జి జానకి ఎదుట హాజరు పరచనున్నారు. కోర్టు సమయం ముగియడంతో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. జడ్జి ఆయనకు రిమాండ్ విధించే అవశాశం ఉంది. ప్రస్తుతం ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీని ఆసుపత్రికి తరలిస్తున్నట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more