మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఔరంగజేబు సమాధిని సందర్శించి.. ఆక్కడ నమాజు చేయడంతో అగ్గికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. దీంతో అక్బరుద్దీన్ పై అటు బీజేపి ఇటు ఎంఎన్ఎస్ ఒంటికాలుపై లేచాయి. మరోవైపు అధికార శివసేన పార్టీ కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో మరోఅడుగు ముందుకేసిన మహారాష్ట్ర నవ నిర్మాణసేన (ఎంఎన్ఎస్) రాష్ట్రంలో అలుముకుంటున్న వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధి ఉండాల్సిన అవసరం ఏముందని ఎంఎన్ఎస్ అధికార ప్రతినిధి గజానన్ కాలే ట్వీట్ మహారాష్ట్రలో అగ్గిరాజేసింది. అంతటితో ఆగని ఆయన రాష్ట్రంలోని ఔరంగజేబ్ సమాధిని ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ఖుల్తాబాద్ ప్రాంతంలో ఉన్న ఔరంగజేబు సమాధిని సమాధిని భారత పురావస్తు శాఖ అధికారులు మూసివేశారు.
ఈ నేపథ్యంలో సమాధి ఉన్న ప్రాంతంలోని మసీదు కమిటీ దానికి తాళం వేయడానికి ప్రయత్నించగా.. ఆర్కియాలజీ శాఖ ఆ చర్యను అడ్డుకుని సమాధి ప్రాంతాన్ని మూసివేసింది. ఐదు రోజులపాటు సమాధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు సమాధి వద్ద భద్రతను పెంచి కట్టుదిట్టం చేశారు. ఈ అంశంపై పురావస్తు శాఖ ఔరంగాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ మిలన్ కుమార్ చౌలే మాట్లాడుతూ... మసీదు కమిటీ ఆ ప్రాంతాన్ని లాక్ చేయడానికి ప్రయత్నించిందని... తాము దాన్ని తెరిపించామని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, ఐదు రోజుల పాటు సమాధిని మూసి వేయాలని నిన్న నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఐదు రోజుల తర్వాత పరిస్థితిని బట్టి సమాధి ప్రాంతాన్ని తెరవాలా? లేక మరో ఐదు రోజుల పాటు మూసివేయాలా? అనే నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more