భారత్పై నిత్యం విషం చిమ్ముతుండే పాకిస్థాన్ తలపెట్టిన మరో భారీ కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేశారు. నలుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్నాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున బుల్లెట్లు, గన్పౌడర్ కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే అసలు బాగోతం బయటపడింది. తెలంగాణలోని ఆదిలాబాద్ కేంద్రంగా భారీ ఉగ్ర కుట్రను ప్లాన్ చేశారు. కాగా, ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు నలుగురు ఉగ్రవాద అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులతో టచ్లో ఉన్నారు. పాక్ ఉగ్రవాదులు చెప్పిన విధంగా నిందితులు తెలంగాణలోని ఆదిలాబాద్కు మందుగుండు సామగ్రిని తరలిస్తున్నారు. నిందితులను గుర్ప్రీత్, అమన్దీప్, పర్మిందర్, భూపిందర్గా పోలీసులు గుర్తించారు. నిందితుడు గుర్ప్రీత్కు ఫిరోజ్పుర్ జిల్లాలో డ్రోన్ ద్వారా పేలుడు పదార్థాలు అందాయి. వీరు నాందేడ్కు పేలుడు పదార్థాలను తరలించే సమయంలో పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయమైన వర్గాల సమాచారం మేరకు పోలీసులు వారిని బస్తారా టోల్ ప్లాజా సమీపంలో చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గరు ఫిరోజ్పుర్కు, మరొకరు లుథియానాకు చెందినవారని తెలిపారు.
ఒక పిస్టల్, 31 లైవ్ క్యాట్రిడ్జ్లు, పేలుడు పదార్థాలతో కూడిన మూడు కంటైనర్లు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఇదిలావుండగా, అటు మణిపూర్లో ఓ బాంబు పేలుడు కలకలం రేపింది. ఆ బాంబును ఐఈడీగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ పేలుడు వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంపాల్ వెస్ట్ సిటీలో సచితా కార్ హౌస్ అనే దుకాణం ఎదుట గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు బాంబు పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
పేలుడు ధాటికి షాప్లోని కొన్ని సామాన్లు, షాపు దగ్గర పార్క్ చేసి ఉన్న కారు ముందు భాగం ధ్వంసమయ్యాయి. బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్తో పాటు మణిపుర్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నిపుణుల బృందం పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు, గుజరాత్లో అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి సుమారు 30 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more