ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి, అంటే, దాదాపు ఫిబ్రవరి చివరి వారం నుంచి దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రిఫైనరీలు రష్యా నుంచి దాదాపు 40 మిలియన్ బారెళ్ల ముడి చమురును కొనుగోలు చేశాయి. ఇతర దేశాల ఆంక్షలు, హెచ్చరికలను పట్టించుకోకుండా, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందున తమకు ప్రస్తుతం అందుతున్న ధర కన్నా తక్కువ ధరకు అందించాలని భారత్ రష్యా ఎదుట డిమాండ్ పెట్టింది. పలు దేశాలు వార్నింగ్ లను పక్కనబెడ్డి క్రూడ్ అయిలను కొనుగోలు చేస్తూ రిస్క్ తీసుకుంటున్నందున ఈ తగ్గింపు న్యాయమైనదేనని భారత్ వాదిస్తోంది.
బ్యారెల్ ముడి చమురును 70 డాలర్ల కన్నా తక్కువకు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల ఉన్నత స్థాయి అధికారుల మధ్య ఈ చర్చలు సాగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 108 డాలర్లకు పైగానే ఉంది. రష్యా నుంచి ఫిబ్రవరి చివరి వారం నుంచి 40 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఇండియా దిగుమతి చేసుకుంది. ఇది రష్యా నుంచి భారత్ మొత్తం 2021 సంవత్సరంలో చేసుకున్న ముడిచమురు దిగుమతి కన్నా 20% ఎక్కువ.
దేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 85% రష్యా నుంచే కొనుగోలు చేస్తుంది. రష్యా నుంచి క్రూడాయిల్ కొంటున్న నమ్మకమైన మిత్రదేశాల్లో భారత్ ప్రధానమైనది. ముఖ్యంగా, ఉక్రెయిన్తో యుద్ధం వల్ల యూరోప్ దేశాల నుంచి క్రూడాయిల్ కొనుగోలుకు డిమాండ్ పూర్తిగా పడిపోవడంతో, భారత్ కొనుగోలుకు ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా, రష్యా వాణిజ్య అవసరాలకు భారత్ చేసే చెల్లింపులు అత్యంత కీలకంగా మారాయి. ఆయుధాలు, ముడిచమురు భారత్కు ఎగుమతి చేసే దేశాల్లో రష్యా ముఖ్యమైనది.
అయితే, ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా, జపాన్, యూరోప్ దేశాలు తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించాయి. అలాగే, రష్యాతో వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని భారత్పైనా ఒత్తిడి తెస్తున్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకుంటూనే రష్యాతో సత్సంబంధాలను ఇండియా కొనసాగిస్తోంది. భారత్ డిమాండ్ చేస్తున్న ధరకు రష్యా అంగీకరిస్తే.. ప్రభుత్వ రిఫైనరీల కోసం నెలకు 15 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంటామని భారత్ హామీ ఇస్తోంది. రిలయన్స్, నయారా ఎనర్జీ తదితర ప్రైవేటు రిఫైనరీలు తమ దిగుమతి అవసరాలను వేరుగా తెలియజేస్తాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more