మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నివాసం ఎదుట ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు తన భర్త, బడ్నేరా ఎమ్మెల్యే రవి రాణాతో కలిసివచ్చి హనుమాన్ చాలీసా చదువుతానని అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, మాజీ టాలీవుడ్ నటి నవనీత్ రాణా సవాల్ చేయడం రాజకీయ దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తున్నారని పోలీసులు కూడా నోటీసులు అందజేశారు. అయితే శనివారం రోజున ముందైలోని వీరి నివాసం ఎదుట శివసైనికులు భారీ సంఖ్యలో చేరుకుని అందోళన చేపట్టారు.
దీంతో ఎంపీ నవనీత్ రాణాతో పాటు అమె భర్త రవి రాణాను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరిపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి.. కోర్టులో హాజరుపర్చగా.. వారికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించాలని అదేశించింది. దీంతోనవనీత్ రాణాను ఆదివారం అర్థరాత్రి బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. ఆమె భర్త, అమరావతిలోని బద్నేరా ఎమ్మెల్యే అయిన రవి రాణాను మొదట ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. అయితే అక్కడ తగినంత స్థలం లేకపోవడంతో, న్యాయపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత అతన్ని నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు.
అంతకుముందు రాణాపై సెక్షన్ 153ఏ (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలు), సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు వారిపై ఐపిసి సెక్షన్ 124-ఎ (దేశద్రోహం)ని కూడా చేర్చారు. ఐపీసీ సెక్షన్ 124-ఎ ప్రకారం ఒ వ్యక్తి మాటల ద్వారా లేదా ద్వేషం లేదా ధిక్కారాన్ని రేకెత్తించేందుకు ప్రయత్నించినప్పుడు లేదా చట్టం ద్వారా స్థాపితమైన ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడానికి ప్రయత్నించినప్పుడు దేశద్రోహ నేరం సెక్షన్ మోపుతారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more