దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. దేశంలోని వీధుల్లో ఆడది అర్థరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని జాతీపిత మహాత్మగాంధీ స్వాత్రంత్య వచ్చిన తొలినాళ్లలో అన్నారంటే.. ఆయన ఎలాంటి విఫత్కర పరిస్థితులను ఊహించారో అన్న విషయాన్ని పక్కనబెడితే.. ఇప్పుడు మహిళలు కనీసం పట్టపగలు కూడా తిరగలేని పరస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఒక్కడో దేశంలోని మారుమూల గ్రామంలో.. అందునా నిర్జన ప్రదేశంలో కాదు.. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని నైరుతిప్రాంతంలో పట్టపగలు తన పిల్లలతో వెళ్తున్న మహిళ.. ఉన్మాది కత్తిదాడిలో హతమైంది.
తన ఇద్దరు చిన్నారులతో కలసివెళ్తున్న ఆమెను ఓ ఉన్మాది వెంబడించి.. మరీ హత్య చేసినట్లు స్థానికంగా ఉన్న సిసిటీవీ ఫూటేజీలో నిక్షిప్తమైంది. నైరుతి ఢిల్లీలో 24 ఏళ్ల మహిళను తన ఇద్దరు పిల్లల ముందే కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆరతి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఆమెను ఓ వ్యక్తి వెంబడించడం ప్రారంభించాడు. దీంతో అతడ్ని గుర్తించిన ఆరతి.. తన కూతుర్ని ఎత్తుకుని.. కొడుకును నడవమని చెబుతూ బిరబిర నడిచింది. అయితే అమెను వెంబడిస్తున్న దుండగుడు అమెను పట్టుకునేందుకు పరుగెత్తాడు.
ఇది గమనించిన ఆరతి ఏం చేయాలో తోచక ఇద్దరు పిల్లలతోనే మహిళ రోడ్డుపై పరుగెత్తింది. అమెను చేరకున్న దుండగుడు తన వద్దనున్న కత్తితో ఆమెను అతి కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యడు. ఈ ఘోర దృశ్యాలన్నీసీసీటీవీ ఫుటేజీలో రికారడ్డయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహిళను పొడిచినట్లు సాగర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి తమకు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మహిళను ఆసుపత్రికి తరలించామని అయితే అప్పటికే అమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దుండగుడి కోసం ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందం రంగంలోకి దిగిందని.. త్వరలోనే పట్టుకుని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడు కొంతకాలం ముందు మృతురాలి పోరుగింట్లోనే ఉండేవారని పోలీసులు గుర్తించారు. అసలు హత్యకు దారితీసిన కారణాలు ఏంటీ అన్న వివరాలు తెలియాల్సివుందని పోలీసులు తెలిపారు. అయితే మృతురాలు ప్రస్తుతం వేరే అద్దె ఇంట్లోకి మారినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు వారి మధ్య గతంలో ఉన్న పరిచయమే కారణమా.? దుండగుడి భయంతోనే అరతి అద్దె ఇంటిని మార్చిందా.? అన్న వివరాలు తెలియాల్సి వుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more