Delhi woman stabbed to death in front of her kids పొరుగింటి మహిళను వెంబడించి.. నడిరోడ్డుపై.. పిల్లల ఎదుటే..

Woman stabbed to death in front of her children cctv footage shows victim being chased by killer

Woman stabbed to death, woman stabbed in front of her kids, woman stabbed to death on road, woman stabbed to death in sagarpur, woman stabbed by neighbour, woman stabbed to death in delhi, Delhi Woman, Arati, victim, former neighbours, Sagarpur area, CCTV footage, chased, Children, Southwest Delhi, Delhi crime news, Delhi, crime

In yet another shocking incident, a 24-year-old woman was stabbed to death, allegedly by a man she used to know, in front of her two children in Southwest Delhi. The CCTV footage, which has been recovered by the police, shows the accused chasing the victim, who is running for her life along with her kids.

ఢిల్లీలో దారుణం: పొరుగింటి మహిళను వెంబడించి.. నడిరోడ్డుపై.. పిల్లల ఎదుటే..

Posted: 04/22/2022 05:39 PM IST
Woman stabbed to death in front of her children cctv footage shows victim being chased by killer

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. దేశంలోని వీధుల్లో ఆడది అర్థరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని జాతీపిత మహాత్మగాంధీ స్వాత్రంత్య వచ్చిన తొలినాళ్లలో అన్నారంటే.. ఆయన ఎలాంటి విఫత్కర పరిస్థితులను ఊహించారో అన్న విషయాన్ని పక్కనబెడితే.. ఇప్పుడు మహిళలు కనీసం పట్టపగలు కూడా తిరగలేని పరస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఒక్కడో దేశంలోని మారుమూల గ్రామంలో.. అందునా నిర్జన ప్రదేశంలో కాదు.. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని నైరుతిప్రాంతంలో పట్టపగలు తన పిల్లలతో వెళ్తున్న మహిళ.. ఉన్మాది కత్తిదాడిలో హతమైంది.

తన ఇద్దరు చిన్నారులతో కలసివెళ్తున్న ఆమెను ఓ ఉన్మాది వెంబడించి.. మరీ హత్య చేసినట్లు స్థానికంగా ఉన్న సిసిటీవీ ఫూటేజీలో నిక్షిప్తమైంది. నైరుతి ఢిల్లీలో 24 ఏళ్ల మహిళను తన ఇద్దరు పిల్లల ముందే కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆరతి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఆమెను ఓ వ్యక్తి వెంబడించడం ప్రారంభించాడు. దీంతో అతడ్ని గుర్తించిన ఆరతి.. తన కూతుర్ని ఎత్తుకుని.. కొడుకును నడవమని చెబుతూ బిరబిర నడిచింది. అయితే అమెను వెంబడిస్తున్న దుండగుడు అమెను పట్టుకునేందుకు పరుగెత్తాడు.

ఇది గమనించిన ఆరతి ఏం చేయాలో తోచక ఇద్దరు పిల్లలతోనే మహిళ రోడ్డుపై పరుగెత్తింది. అమెను చేరకున్న దుండగుడు తన వద్దనున్న కత్తితో ఆమెను అతి కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యడు. ఈ ఘోర దృశ్యాలన్నీసీసీటీవీ ఫుటేజీలో రికారడ్డయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహిళను పొడిచినట్లు సాగర్‌ పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి నుంచి తమకు ఫోన్‌ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మహిళను ఆసుపత్రికి తరలించామని అయితే అప్పటికే అమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారని పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దుండగుడి కోసం ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందం రంగంలోకి దిగిందని.. త్వరలోనే పట్టుకుని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడు కొంతకాలం ముందు మృతురాలి పోరుగింట్లోనే ఉండేవారని పోలీసులు గుర్తించారు. అసలు హత్యకు దారితీసిన కారణాలు ఏంటీ అన్న వివరాలు తెలియాల్సివుందని పోలీసులు తెలిపారు. అయితే మృతురాలు ప్రస్తుతం వేరే అద్దె ఇంట్లోకి మారినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు వారి మధ్య గతంలో ఉన్న పరిచయమే కారణమా.? దుండగుడి భయంతోనే అరతి అద్దె ఇంటిని మార్చిందా.? అన్న వివరాలు తెలియాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles