ఇంధన ధరలపై కేంద్రం ఎన్నికలకు ముందు ఒకలా వ్యవహరిస్తూ.. ఎన్నికల తరువాత మరోలా వ్యవహరిస్తూ వాహనదారులను ఇంధన పేరుతోనే భయాందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఈట్ కా జవాబ్ పత్తర్ సే.. (ఇటుకకు జవాబు రాయితో) అన్న చందంగా.. ఇందన ధరలను పెంచుతూ కేంద్రంతో పాటు చమురు సంస్థలు నిర్ణయం తీసుకుని వాహన దారులపై భారం వేస్తుంటే.. అదే ఇంధన ధరలతో తన నిరసన తెలపాలని ఓ బంకు నిర్వాహకుడు చేపట్టిన చర్యల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. ఏకంగా లీటరు పెట్రోల్ 120కి చేరుకున్న వేళ.. దానిని కేవలం ఒక్క రూపాయికి మాత్రమే అందించాడు.
ఏంటీ రూ.1కే లీటర్ పెట్రోల్ అమ్ముతున్నారా..? ఇది నిజమేనా.. లేక ఏప్రిల్ మాసంలో ఎఫ్పుడైనా ఫూల్ చేయవచ్చునని ఇలా అంటున్నారా.? అన్న సందేహం వస్తుందా.? ఇది ముమ్మాటికీ నిజమే. అయితే ఈ లీటర్ పెట్రోల్ కావాలని అనుకుంటూ అది మనకు అందుబాటులో లేదు. కేవలం మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతవాసులకు మాత్రమే. ఇక్కడ ఓ బంక్ నిర్వాహకుడు కేవలం ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్ విక్రయించాడు. అయితే అది కేవలం నిన్న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన ఇలా పెట్రోల్ ను కారుచౌకగా విక్రయించారు. మరి అతనికి చాలా లాస్ కదా.. ఇలా ఎందుకు చేశాడు.. అన్న వివరాల్లోకి వెళ్తే..
ఇంధన ధరల భారం సామాన్యులు మోయలేకుండా పోతున్నారని.. మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఈ ధరలు విపరీతంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.. మధ్యతరగతి వారు కూడా ఇంధన ధరలు, నిత్యావసరాల సరుకుల ధరలతో పాటు కూరగాయాల ధరలు కూడా పెరగడంతో రోజుకో పూట బోజనాలు మాత్రమే చేస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ధరలు తగ్గించాలని ప్రధాని మోడీకి సందేశం ఇచ్చేందుకు ఇలా చేసినట్లు పెట్రోల్ బంకు నిర్వాహకుడు ఇలా తన నిరసనను వ్యక్తం చేసినట్లు ప్రకటించారు. ఈ కారణంతోనే తాను లీటరు పెట్రోల్ ను కేవలం రూ.1కే విక్రయించానని అన్నారు.
అయితే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని క్రితం రోజున తమ పెట్రోల్ బంకు వున్న మహారాష్ట్ర సోలాపుర్ ప్రాంతవాసులకు ఈ అవకాశాన్ని అందించానని తెలిపారు. అయితే రోజు మొత్తం కాదండోయ్.. కేవలం ఈ రోజులో తొలుత తమ బంకులో పెట్రోల్ కోట్టించుకునే 500 ద్విచక్రవాహనాలకు మాత్రమే ఈ ఆపర్ లభిస్తుందని కూడా కండీషన్ పెట్టారు. అయితే రూ.1కే లీటర్ పెట్రోల్ లభిస్తుండటంతో ఈ పెట్రోల్ బంకుకు వాహనదారులు పోటెత్తారు. ఇక వీరిని సక్రమంగా లైన్లో వచ్చేలా చేసేందుకు పోలీసులు కూడా రంగప్రవేశం చేయాల్సివచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
सोलापुरात डॉ. बाबासाहेब आंबेडकर जयंती निमित्त फक्त 1 रुपयात 1 लीटर पेट्रोल
— Maharashtra Today (@mtnews_official) April 14, 2022
यावर तुमची प्रतिक्रिया कमेंट्स करून सांगा#maharashtratoday #solapur #AmbedkarJayanti #AmbedkarJayanti2022 pic.twitter.com/Bhhg4VxsP3
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more