డ్రాగన్ దేశానికి భారత్ మరోమారు గట్టి షాక్ ఇచ్చింది. ఈ మధ్య వరుసపెట్టి షాకిస్తున్న భారత్ దెబ్బకు చైనా విలవిలలాడుతోంది. గత ఏడాది పలు చైనా యాప్ లపై నిషేధాన్ని విధించిన భారత్.. అవి కొత్త రూపంతో మళ్లి అడుగుపెట్టిన వేళ.. వాటితో పాటు మరిన్ని కలుపుకుని మొత్తంగా 54 యాప్ లపై నిషేధాన్ని విధించింది. దీంతో చైనాకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. దేశ భద్రతకు సమస్యగా మారిన ఈ 54 చైనా యాప్లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా అదేశాలను జారీ చేసింది.
నిషేధిత జాబితాలో స్వీట్ సెల్ఫీ హెడ్, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ జీవర్, ఒన్మోజీ ఎరినా, యాప్ లాక్, డ్యుయల్ స్పేస్ లైట్ యాప్లు ఉన్నట్లు తెలుస్తోంది. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఆ యాప్లు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జూన్లో చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేషన్లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వాటిల్లో పాపులర్ యాప్లైన టిక్, వీచాట్, హలో కూడా ఉన్నాయి. జాతీయ భద్రతకు, సార్వభౌమాధికారినికి ముప్పు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ 54 యాప్ లు చాలా ముఖ్యమైన డేటాకు అనుమతులు అడుగుతూ సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఆ యాప్లు రియల్ టైమ్ డేటాను తీసుకుంటున్నాయని ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని చెప్పాయి. 2020 మేలో చైనాతో సరిహద్దు ఘర్షణ మొదలైన తర్వాత ఇప్పటి వరకు 300 యాప్లను నిషేధించారు. గాల్వాన్ ఘర్షణ తర్వాత ఆ ఏడాది జూన్లో తొలిసారి చైనీస్ యాప్లను బ్యాన్ చేశారు. చైనా యాప్ ల విషయంలో భారత్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ నిషేధాలు విదిస్తుండటంతో చైనాకు దిమ్మదిరిగే షాక్ తగులుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more