దాదాపుగా మూడు దశాబ్దాల కాలం నుంచి తన ఉనికిని కోల్పోయిన తరుణంలో.. హిట్ బాట పట్టిన పుష్ఫ చిత్రంలోని శ్రీవల్లి పాటతో ప్రచారాన్ని కల్పించడంతో.. తాము సక్సెస్ మార్గంలో పయనించేందుకు దోహదపడుతుందని భావించిందో ఏమో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదే సూత్రాన్ని ఇప్పడు ఫాలో అవుతోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే బరిలోకి దిగుతున్న కాంగ్రెస్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలోని పాటను తమ ఎన్నికల ప్రచారంలో భాగం చేసింది.
ఈ చిత్రం బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తూంగా, ఆ సినిమాలోని పాటలు అందరి నోళ్లపై అడేస్తున్నాయి. ఇక క్రికెటర్ల నుంచి ప్రముఖల వరకు అందరూ వాటిని అనుకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ పాటతోనే తాము కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని అనుకుని కాంగ్రెస్ దానిని సద్వినియోగం చేసుకుంది. కొత్తగా అలోచించి.. రాసిన పాట ఉత్తర్ ప్రదేశ్ వాసులను కూడా బాగా ఆకర్షిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ఓ సాంగ్ను విడుదల చేసింది. ఈ పాటలోని ట్యూన్ను పుష్ప సినిమాలోని ‘చూపే బంగారామాయేనే శ్రీవల్లి..’ సాంగ్ నుంచి తీసుకున్నారు.
ఉత్తర ప్రదేశ్ గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు. ‘తూ హై గజబ్ యూపీ, తేరీ కసమ్..’ (చాలా అందంగా ఉంటావు యూపీ..) అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఈ పాటను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన యూపీ కాంగ్రెస్.. యూపీ వాసులమైనందుకు గర్వంగా ఉంది’ అన్న క్యాప్షన్ జోడించింది. యూపీలో ఈ నెల 10న తొలి విడతల ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 410 స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.
यूपी वाला होने पर गर्व है।#सुप्रभातUP pic.twitter.com/WuSxv9o67a
— UP Congress (@INCUttarPradesh) February 4, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more