కరోనా మహమ్మారి ప్రజలను అనేక రకాలుగా బలి తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ వచ్చిందన్న అందోళనతోనే కొందరు రోగులు మరణించగా, చికిత్స పోందుతూ బ్లక్ ఆక్సిజన్ లెవల్స్ తగ్గి పరిస్థితి విషమించడంతో మరికోందరు మరణించారు. ఇక అప్పటికీ దీర్ఘకాలిక రోగాలబారిన పడిన వారు కూడా కోవిడ్ చికిత్స పోందుతూ మరణించారు. ఇక తాజాగా వైద్యులు తెలుపుతున్న తాజా విషయాల ప్రకారం మరికోందరు కొవిడ్ బారిన పడి కోలుకున్న తరువాత కూడా హృద్రోగ సమస్యలతో మృతిచెందారు. ఇలాంటి అనేక ఘటనలు మనం తొలి, రెండవ దశలో చూశాం. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ తో దేశవ్యాప్తంగా మూడవ దశ ప్రభావం కొనసాగుతోంది. ఈ దశలోనూ కోవిడ్ బారిన పడిన బాధితులు తమ అరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కోవిడ్ బాధితులందరూ తమ గుండె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వుండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. కరోనా గత రెండు వేరియంట్లతో ప్రత్యక్షంగా ప్రభావిత కేసులు నమోదు కాగా, తాజాగా తన ఉద్దృతిని కోనసాగిస్తు్న ఒమిక్రాన్ వేరియంట్ పెద్దగా లక్షణాలు కనిపించడం లేదని తేలిగ్గా తీసుకుంటున్న ప్రజలకు.. అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఒమిక్రాన్ కారణంగా గుండె పనితీరు ప్రభావితం అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గుండెదడ, హృదయ స్పందనల్లో వ్యత్యాసాల సమస్యతో ఎక్కువ మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్న తరువాత తమను ఆశ్రయిస్తున్నారని వైద్యులు తెలిపారు. గుండె కణజాలం బలహీనపడడంతో పాటు, ఇతర సమస్యలను గుర్తిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
కోవిడ్ మొదటి (ఆల్ఫా), రెండో (డెల్టా) విడతలో గుండె దెబ్బతినడం, గుండె విఫలమై మరణించిన కేసులను కూడా ప్రస్తావిస్తున్నారు. ఒమిక్రాన్ లో లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నా.. కోలుకున్న వారిలో కార్డియోమయోపతి, రక్తం గడ్డకట్టడం, దడ, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించే రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ‘‘మా దగ్గరకు వచ్చే బాధితుల్లో చాలా మంది శ్వాస తీసుకోవడం భారంగా అనిపిస్తోందని, గుండె దడ అని చెబుతున్నారు. కరోనా వైరస్ రక్త నాళాల్లో వాపునకు కారణమవుతోంది. దీనివల్ల బ్లడ్ క్లాట్ ఏర్పడడం జరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రావచ్చు. కనుక వారు జాగ్రత్తగా ఉండాలి’’ అని హైదరాబాద్ కు చెందిన కార్డియాలజిస్ట్ గణేష్ మంథన్ పేర్కొన్నారు.
‘‘ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోగులకు కోవిడ్ ప్రాణాంతకం అని నిరూపించవచ్చు. కోలుకున్న రోగులలో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, మూర్ఛ, బలహీనమైన గుండె, గుండె దెబ్బతినడం వంటి నాలుగు ప్రముఖ సమస్యలు గమనించబడ్డాయి, ”అని ఢిల్లీకి చెందిన జిబి పంత్ అసుపత్రిలోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్డర్ మోహిత్ గుప్తా చెప్పారు. కొన్ని సందర్భాల్లో, అంతర్లీన గుండె జబ్బులు ఉన్నవారు తీవ్రమైన లక్షణాలను కూడా ఎదుర్కోంటారని వైద్యులు తెలిపారు. అక్యూట్ మయోకార్డియల్ ఇంజ్యూరీకి వైరస్ కారణమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి వైరస్ ప్రాణాంతకంగా మారుతోందని అంటున్నారు.
"ప్రజలు గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా కోవిడ్ అనంతరం ఎదుర్కొన్నారు, దీని కారణంగా వారు కోలుకున్న తర్వాత గుండె మంటను తరచుగా అనుభవిస్తూ తమను ఆశ్రయించారని.. దీనికి తోడు రక్తపోటు స్థాయిలు తగ్గడం, అధిక మధుమేహ స్థాయిలు కూడా నమోదయ్యాయి”అని ఎల్బి నగర్లోని కామినేని హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాగర్ భుయార్ అన్నారు. కోలుకున్న వారిలో గుండె సమస్యలతో పాటు ఛాతీలో నొప్పి, తల తిరగడం, బలహీనత సమస్యలను ఎదుర్కొంటున్నట్టు వారు గుర్తించామన్నారు. కరోనా నుంచి బయటపడిన తర్వాత మూడు నెలల వరకు ఎటువంటి కఠోర వ్యాయామాలు, కష్టమైన పనుల జోలికి వెళ్లకుండా ఉండాలన్నది వైద్యుల సూచన. నిదానంగా ప్రారంభించి, క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలని పేర్కొంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more