తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేరచరితులు, రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్న 18 మందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిందని అరోపిస్తూ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ విచారించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపి అధికార ప్రతినిధి జి. భానుప్రకాష్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిల్ లో టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించిన వారిలో 18 మందికి నేరచరిత్ర, లేదా రాజకీయ పార్టీలతో సంబంధాలు వున్నాయని పేర్కోన్నారు. గతంలో దాఖలైన ఈ పిటీషన్ ను విచారించేందుకు స్వీకరించిన న్యాయస్థానం పిల్ లో పేర్కోన్నవారికి నోటీసులు దాఖలు చేయాలని అదేశించింది.
భాను ప్రకాష్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి లతో కూడిన రాష్ట్రోన్నత న్యాయస్థాన ధ్విసభ్య ధర్మాసనం విచారించింది. అయితే తాము అందజేసిన నోటీసులను తీసుకోవడానికి ముగ్గురు టీటీడీ ట్రస్టుబోర్డు సభ్యులు నిరాకరించారని తెలిపారు. హైకోర్టు జారీచేసిన నోటీసులను వారు తిప్పిపంపించారని భాను ప్రకాశ్ రెడ్డి తరపు న్యాయవాది ఎన్ అశ్వనీ కుమార్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. అయితే నోటీసులను తిరస్కరించిన వారికి స్థానిక దినపత్రికల్లో ప్రకటనల ద్వారా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు పిటీషనర్ కు సూచిచింది.
తమపై కేసులు ఎదుర్కొంటున్న కొందరిని టీటీడీ ట్రస్ట్ బోర్డులో నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు ట్రస్ట్బోర్డు సభ్యులు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎంఎన్ శశిధర్, అల్లూరి మహేశ్వరిలకు పంపిన నోటీసులు తిరిగి వచ్చాయని, మరికొందరు నోటీసులు తీసుకోవడానికి నిరాకరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. నోటీసులను ఆమోదించిన వారు తమ కౌంటర్ దాఖలు చేయాలని కోరిన ధర్మాసనం, తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more