సభావేదికపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆసీనులైయ్యారు. ఆయన సమక్షంలోనే ఇద్దరు ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలు బాహాబాహీకి దిగినంతపని చేశారు. ఈ ఘటన నేపథ్యంలో సభాస్థలిపై ఉన్న ఇతర నేతలు వారి మధ్యలో సరైన సమయంలో జోక్యం చేసుకుని సర్థిచెప్పడంతో ఒకింత జరగాని ఘటనలకు కూడా తెరపడినట్లు అయ్యింది. ఆ రాష్ట్రంలో అధికారంలో వున్న బీజేపీ మంత్రి, ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు దాదాపు కొట్టుకున్నంత పనిచేశారు. స్టేజీపైనే తమను ఎన్నుకున్న ప్రజల సాక్షిగా వారు వాగ్యుద్దానికి దిగారు. పరుషపదజాలంలో తిట్టుకున్నారు. మన పోరుగునున్న కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రామనగరలో బి.ఆర్.అంబేద్కర్ విగ్రహంతో పాటుగా బెంగుళూరు నగర వ్యవస్థాపకుడు కెంపెగౌడల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మంత్రి సి.ఎన్. అశ్వంత్ నారాయణ్, కాంగ్రెస్ ఎంపీ డి.కె. సురేశ్ లు కూడా ప్రోటోకాల్ ప్రకారం హాజరయ్యారు. సభావేదిక నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రి అశ్వంత్ నారాయణ్ మాట్లాడాతూ.. ప్రతిపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ప్రజల నమ్మకాన్ని చూరగొనేందుకే బీజేపీ ప్రభుత్వం ఇక్కడకు వచ్చిందని, వారిని మోసం చేసేందుకు కాదని అన్నారు.
మంత్రి నారాయణ ప్రసంగిస్తున్న సమయంలో ఎంపీ సురేష్ ను కించపరిచేలా కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలనే నారాయణ కూడా స్టేజ్ మీద నుంచి చేయడంతో సురేశ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నారాయణ మీదకు వెళ్లారు. మైకును లాక్కోబోయారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చెలరేగింది. దాదాపు కొట్టుకునేంత పనిచేశారిద్దరు. భద్రతా సిబ్బంది, ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఘర్షణ అనంతరం సురేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎస్. రవి సహా ఆ పార్టీ నేతలు స్టేజీపైనే నిరసనకు దిగారు. కార్యక్రమం తర్వాత మంత్రి అశ్వంత్ పోస్టర్లు, బ్యానర్లను కాంగ్రెస్ నాయకులు చించేశారు.
#WATCH: Karnataka #Congress MP DK Suresh and #BJP Minister C. N. Ashwath Narayan creates ruckus in front of @CMofKarnataka Basavaraj Bommai at a government event in Ramanagara district. @IndianExpress pic.twitter.com/IyGXfurRWB
— Darshan Devaiah B P (@DarshanDevaiahB) January 3, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more