చెప్పులపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సీపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వినూత్న రీతిలో నిరసనను వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమలుకు నోచుకోనున్న తరుణంలో ఆయన డిసెంబర్ నుంచే తన వ్యతికేతను ప్రదర్శించారు. అంతటితో ఆగని ఆయన ఇక నుంచి పేదలు కాళ్లకు చెప్పులు వేసుకునేందుకు బదులు తలపై పెట్టుకునేలా కేంద్రం నిర్ణయం ఉందని ఆయన వ్యంగోక్తులు విసిరారు. అంతటితో ఆగని ఆయన ఈ మేరకు మీడియా సమావేశంలో తన తలపై చెప్పులు పెట్టుకుని కూడా నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా ఇదే అంశంపై తన వ్యతిరేకతను మరోలా ప్రదర్శించారాయన. తానే స్వయంగా చెప్పులు కుట్టి, వాటికి పాలిష్ చేసి తన నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చెప్పులు కుట్టి, పాలిష్ చేశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోని ప్రభుత్వాలన్నీ పేదరిక వ్యతిరేకంగా పనిచేస్తే.. ప్రధాని మోడీ ప్రభుత్వం మాత్రం పేదవాడికి వత్యిరేకంగా పనిచేస్తోందని అరోపించారు. మాటల్లో పేదవాడిని గెలిపించి.. చేతల్లో అణచివేస్తూ.. పెద్దవాళ్ల (కార్పొరేట్ల) కనుసన్నళ్లో పనిచేస్తోందని నారాయణ విమర్శించారు.
తాజాగా పేదవాడికి నిత్యావసర వస్తువుగా మారిన చెప్పులను కూడా కేంద్ర ప్రభుత్వం వదలడం లేదని దుమ్మెత్తి పోశారు. సామాన్యుడి కష్టం తనకు తెలుసు కాబట్టే నెత్తిన చెప్పులు పెట్టుకున్నానని అన్నారు. దీనికి బీజేపీ నేతలు మాత్రం స్థాయి దిగజారిపోయారని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ఏపీలోని సినిమా టికెట్ల వివాదంపై మాట్లాడుతూ.. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోయడానికి ప్రయత్నించడం శోచనీయమని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more