ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అమరావతి నుంచి తిరుపతి వరకు రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు వరుణుడు బ్రేక్ ఇచ్చాడు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం ధాటికి రైతులు తాము బస చేసిన ఎస్ఎస్బి కళ్యాణమండపంలోనే గత రెండు రోజులుగా సేద తీరుతున్నారు. అయితే అవరావతి రైతులు మహాపాదయాత్ర చేస్తూ తన నియోజకవర్గం పరిధిలోని ఓ కళ్యాణమండపంలో బస చేస్తున్నారన్న వార్త తెలుసుకున్నా స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రైతుల వద్దకు చేరుకున్ని వారికి సంఘీభావం తెలిపారు.
తన నియోజకవర్గ పరిధిలోనే అమరావతి ప్రాంత రైతులు గత రెండు రోజులుగా బసచేశారన్న సమాచారం తెలుసింది. దీంతో మీమల్ని కలుద్దామని తాను వచ్చానని చెప్పారు. రైతులుకు ఏమీ కావాలన్నా.. తనకు వెంటనే ఫోన్ చేయవచ్చునని చెప్పారు. అంతేకాదు రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పినతో పాటు వర్షం తగ్గి వారు తిరిగి పాదయాత్రను ప్రారంభించేంతవరకు వారికి కావాల్సిన సరుకులు కూడా తాను పంపిస్తానని చెప్పారు. అయితే తాను తన పార్టీకి వ్యతిరేకంగా ఏ పనులు చేయడం లేదని చెప్పుకోచ్చిన ఆయన.. దేశానికే అన్నం పెట్టే రైతు అవస్థలు పడకూడదని తాను వారిని సంఘీభావం తెలపడానికి వచ్చానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more