గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ బీజేపీ అధిష్టానానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని ఇవ్వాలని కోరారు. తనకు పనాజీ స్థానంలో పోటీ చేసేందుకు తనకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని హెచ్చరించారు. తన తండ్రి మాజీ కేంద్రమంత్రి, గోవా ముఖ్యమంత్రి అయిన దివంగత మనోహర్ పారికర్.. ఈ స్థానానికి 25 ఏండ్ల పాటు ప్రాతినిథ్యం వహించిన సంగతిని ఆయన గుర్తు చేశారు.
‘నేను పనాజీ (పంజిమ్) నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పటికే దీని గురించి పార్టీకి చెప్పాను. పార్టీ టిక్కెట్ ఇస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని మీడియాతో అన్నారు. బీజేపీ ఒకవేళ టిక్కెట్ నిరాకరించిన పక్షంలో ఏమి చేయాలనుకుంటున్నారు? అని ఉత్పల్ను మీడియా ప్రశ్నించింది. అయితే దాని గురించి మాట్లాడే సమయం ఇది కాదని ఆయన అన్నారు. ‘దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనోహర్ పారికర్ తన జీవితంలో ఏదీ తేలికగా పొందలేదు. అన్నింటినీ ఆయన ఎంతో కష్టపడి దక్కించుకున్నారని చెప్పారు.
అదేవిధంగా, తాను కూడా తనకు కావలసిన దాని కోసం పని చేస్తున్నానని అన్నారు. తనకు టికెట్ రాని పక్షంలో తాను కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఈ నిర్ణయాలు తీసుకోవడానికి తనకు అవసరమైన బలం కోసం ప్రార్థిస్తున్నాను’ అని వ్యాఖ్యానించి పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. ఒకవేళ ఆ అవసరం వస్తే బీజేపీలో ఉంటూనే పోరాటం చేస్తానని ఉత్పల్ పారికర్ తెలిపారు. ‘నిర్ణయం తీసుకునే సమయం వచ్చినప్పుడు, నేను ప్రజల మాట వింటాను. నేను పార్టీకి చెప్పాను. పార్టీ నాకు (టిక్కెట్) ఇస్తుంది. నేను నమ్మకంగా ఉన్నాను’ అని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more