మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మనీలాండరింగ్ కేసుపై ఈ నెల 1న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనను అరెస్ట్ చేసింది. అనీల్ దేశ్ ముఖ్ కేసుకు సంబంధించి మరిన్నీ వివరాల కోసం తమ కస్టడీకి అప్పగించాలన్న ఈడీ అధికారుల పిటీషన్ నేపథ్యంలో కస్టడీకి అప్పగించిన విషయం తెలసిందే. కాగా, ఈడీ కస్టడీ గడువు ముగియడంతో ఇవాళ ముంబై హాలిడే కోర్టులో అనిల్ దేశ్ముఖ్ను ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. కస్టడీని పొడిగించాలన్న ఈడీ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది.
అనిల్ దేశ్ముఖ్కు ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు అనీల్ దేశ్ ముఖ్ కు బెయిల్ కోసం ఆయన న్యాయవాదులకు లైన్ క్లియర్ అయ్యింది. ముంబైలోని హోటళ్లు, బార్ల నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లు వసూలు చేయాలని సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజ్ను హోంమంత్రి హోదాలో అనిల్ దేశ్ముఖ్ ఆదేశించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో ఈడీ కూడా మనీలాండరింగ్ కింద దీనిపై విచారణ జరుపుతున్నది. ఇందులో భాగంగా అనిల్ దేశ్ ముఖ్ ను 12 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు ఈ నెల 1న ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ గడువు ముగియడంతో అనిల్ దేశ్ముఖ్కు కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా అనీల్ దేశ్ ముఖ్ తరపున ఆయన తనయుడు హృషికేశ్ న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. కాగా తండ్రి మనిలాండిరింగ్ కేసులో విచారణకు తమ ఎదుట హాజరుకావాలని ఈడీ అధికారులు హృషికేశ్ కు కూడా నోటీసులు అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more