‘రైతులు.. భిక్షగాళ్లు కాదు. వారి భూములు తీసుకున్న దరమిలా పరిహారం పోందడం వారి హక్కు.. వారికి పరిహారాన్ని తక్షణమే అందజేయాలని తెలంగాణ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణం కోసం, అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం రైతులు తమ భూములను త్యాగం చేస్తున్నారు. వారికి పరిహారం ఇవ్వకుండా వారి భూములెలా స్వాధీనం చేసుకుంటారు’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరిహారం కోసం ఎదురుచూస్తూ దశాబ్దాలు గడుస్తున్న క్రమంలో అనేక మంది రైతులు తీవ్రఅవేదన, అందోళనలకు గురై దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆసహనం వ్యక్తం చేసింది.
భూ నిర్వాసితులకు రావాల్సినపరిహారం ఇకనైనా సాధ్యమైనంత త్వరగా చెల్లించాలని.. అంతేకానీ వారికి పరిహారం అందజేయడంలో ప్రభుత్వం ఎలాంటి దాతృత్వం చూపించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. భూములు స్వాధీనం చేసుకొని ప్రాజెక్టులు నిర్మించి పరిహారం కోసం ఏళ్ల తర బడి వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదని తేల్చిచెప్పింది. 1966లో తీసుకున్న తమ భూములకు పరిహారం చెల్లించలేదని, పరిహారం ఇవ్వాలంటూ ఇదే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయట్లేదంటూ జగిత్యాల జిల్లా రత్నాపూర్కు చెందిన బుక్కిరి లింగన్నతోపాటు మరో ఐదుగురు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను న్యాయస్థాన ధర్మాసనం విచారించింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మళ్లీ విచారించింది. గతంలో ధర్మాసనం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. సాంకేతిక కారణాలతో డిపాజిట్ చేయడంలో జాప్యం జరిగిందని వివరణ ఇచ్చారు. 1966లో నిజామాబాద్ జిల్లాలో ఎస్సార్ఎస్పీ ప్రాజె క్టు కోసం భూమి సేకరించారని, ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదని పిటిషనర్ల తరఫున న్యాయవాది గుడి మధుసూదన్రెడ్డి వాదనలు వినిపించారు. పరిహారం చెల్లిస్తామంటూ మూడుసార్లు హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ‘భూసేకరణ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా పరిహారం కోరుతూ వందల కేసులు దాఖలవుతున్నాయని న్యాయస్థానం తెలిపింది. పరిహారం దక్కించుకోవడం రైతుల హక్కు. తద్వారా ప్రభుత్వం ఏ ధాతృత్వ కార్యక్రమాన్ని చెపట్టినట్టు కాదని న్యాయస్థాన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని, పిటిషనర్లకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more