తన అకౌంటు ఉన్న బ్యాంకు అధికారులు చెప్పిన కారణంగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసిన ఓ రిక్షా కార్మికుడికి ఆదాయ పన్ను శాఖ షాక్ ఇచ్చింది. రెక్కాడితే కానీ డొక్కాడని వర్గానికి చెందిన రిక్షా కార్మికిడికి ఏకంగా రూ.3 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదాయపన్ను శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసింది. రిక్షా బండి చక్ర్ం ఒక రోజు తిరగకపోయినా తన పూట గడవని పరిస్థితుల్లో వున్న రిక్షావాలా.. ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఐటీ చెల్లించాలని నోటీసులు రావడంతో షాక్కు గురయ్యాడు. దిక్కుతోచని పరిస్థితుల నేపథ్యంలో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలోని బకాల్ పూర్ ప్రాంతంలోని అమర్ కాలనీకి చెందిన ప్రతాప్ సింగ్ ఓ రిక్షా కార్మికుడు. రోజూ తన రిక్షా చక్రం లాగుతూనే బ్యాంక్ అధికారులు పాన్ కార్డును అకౌంట్కు అనుసంధానించాలని చెప్పారు. దీంతో ఈ ఏడాది 15న బకాల్పూర్లోని జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం అప్లయ్ చేశాడు. కొన్ని రోజులకు సంజయ్ సింగ్ అనే వ్యక్తి.. పాన్కార్డు కలర్ కాపీని ప్రతాప్ సింగ్కు ఇచ్చాడు. అయితే నిరక్షరాస్యుడైన ప్రకాశ్ సింగ్ అసలు కార్డుకు, కలర్ కాపీకి తేడా గుర్తించలేకపోయారు.
కాగా, ఈ నెల 19న రూ.3,47,54,896 చెల్లించాలని ఐటీ అధికారులు ప్రకాశ్ సింగ్కు నోటీసులు జారీ చేశారు. తన జీఎస్టీ నంబర్తో 2018-19లో రూ.43,44,36,201 మేర వ్యాపారం చేసినందుకుగాను ఈ మొత్తాన్ని చెల్లించాలని అందులో పేర్కొన్నారు. అయితే తాను రిక్షా కార్మికుడినని చెప్పడంతో.. తన పాన్ కార్డును మరెవరో దుర్వినియోగం చేశారని ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని ఐటీ అధికారులు సలహా ఇచ్చారు. దీంతో ప్రతాప్ సింగ్ మధుర పోలీసులో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more