కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కొంత సమయం అదుపులోకి తీసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు అమెతో పాటు మరో నలుగురిని ఆగ్రాకు వెళ్లేందుకు అనుమతించారు. ఆగ్రాలో శానిటరీ వర్కర్ ను దొంగతనం అభియోగాలపై అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలిస్ స్టేషన్ లో పెట్టగా ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అయితే ఇది లాకప్ డెత్ అని.. పోలీసులే శానిటరీ వర్కర్ మరణానికి కారణమని అరోపణలు వెల్లువెత్తడంతో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ బయలుదేరారు. దీంతో పోలీసులు లక్నో-అగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై అమెను మరోసారి ఇవాళ అడ్డుకున్నారు.
ఆగ్రాలో పోలీస్ కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని కలిసేందుకు బుధవారం ఆమె వెళ్తున్న వాహనాన్ని నిలిపివేశారు. ఆగ్రాలో సెక్షన్ 144 అమలులో వుందని అందుచేత రాజకీయ నాయకులతో పాటు ఎవరినీ ఆగ్రాకు అనుమతించరాదని జిల్లా కలెక్టర్ అదేశాలు జారీచేశారని.. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో హత్యకు గురైన బాధిత రైతు కుటుంబాలను పరిమర్శించేందుకు ప్రియాంక గాంధీ వెళ్లగా తొలిసారిగా అడ్డుకుని కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ మరోమారు అమెను అడ్డుకుని.. ఆమె వెళ్తున్న వాహనాన్ని ముందుకు కదలనీయలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
అవసరమైన అనుమతులు లేనందునే ప్రియాంక గాంధీని నిలువరించినట్లు యూపీ పోలీసులు తెలిపారు. అయితే తాను ఎక్కడికి వెళ్లాలన్నా పరిమిషన్ తీసుకోవాలా అని ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా, రూ.25 లక్షలు చోరీ చేసిన ఆరోపణలతో అరెస్ట్ అయిన అరుణ్ అనే వ్యక్తిని జగదీష్పురాలోని పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ చేస్తుండగా ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి అతడ్ని ఇంటి నుంచి అరెస్ట్ చేయగా అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రికి తరలించామని, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారని ఆగ్రా సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
కాగా పోలీసుల అడ్డగింతపై మీడియాతో మాట్లాడిన ప్రియాంక.. తాను ఆగ్రాకు వెళ్లకూడదని, కలెక్టర్ అదేశాల నేపథ్యంలో అడ్డుకోక తప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే తాను ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్తేంటే మినహాయించి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా తనను అడ్డుకుంటున్నారని అరోపించారు. తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పోలీసులు అనుమతి తీసుకోవాలా.? అని ప్రశ్నించారు. ఇకనేం తాను రెస్టారెంట్లలో కూర్చుంటానని, అదే మీకు రాజకీయంగా ఎంతో సౌకర్యవంతంగా వుంటుందని విమర్శించారు. తాను బాధిత కుటుంబంతో కలవాలని అమె అన్నారు
#WATCH | Lucknow: Congress' Priyanka Gandhi Vadra & her convoy stopped by Police on their way to Agra. Police say, "You don't have permission, we can't allow you"
— ANI UP (@ANINewsUP) October 20, 2021
She was going to meet family of a sanitation worker who was nabbed in connection with a theft&died in Police custody pic.twitter.com/N3s0QAU8n6
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more