ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రెండేళ్లుగా ఆప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు చేస్తున్నారు. కాగా అమరావతి రైతుల నిరసన దీక్షలు ఇవాళ్టికి ఏకంగా 666 రోజుకు చేరకున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలోని మోతడకలో రైతులు సమావేశాలు నిర్వహిచారు. రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానుల విధానానికి స్వస్తి పలికి ఏకైక అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజధాని ఉధ్యమగీతాలను ఆలపించారు. గీతాలతో కూడిన పలు సీడిలను అవిష్కరించారు.
ఈ సందర్భంగా జేఏసీ, ప్రజా సంఘాలు, సీపీఐ నేతలు మాట్లాడుతూ.. అమరావతిపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని సమూలంగా నాశనం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో భాగంగా అర్థ, అంగ బలగాలను ప్రదర్శిస్తోందని ఆరోపించారు. మహాపాదయాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు అమరావతి జేఏసీ కన్వీనర్ సుధాకర్ తెలిపారు. అధికారంలోకి రాకముందు అసెంబ్లీ సాక్షితా అమరావతి రాజధానికి జైకోట్టిన జగన్.. అధికారంలోకి రాగానే ఎందుకు మాటమార్చి మూడు రాజధానుల పాటను అందుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరించడ మానేసి.. ప్రజల పక్షాన నిలిచి అలోచిస్తే పాలన జనరంజకంగా వుంటుందని అన్నారు.
ఆంధ్రులంతా ఏకమై ప్రభుత్వ కుట్రల్ని తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి వీరాంజనేయులు పిలుపునిచ్చారు. అమరావతి ఆందోళనల్లో భాగంగా నెక్కల్లు, తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, వెంకటపాలెం, రాయపూడి తదితర గ్రామాల్లో నిరసనలు జరిగాయి. కాగా, ఉద్యమం 666వ రోజుకు చేరుకున్న సందర్భంగా ‘‘అహో ఆంధ్రులారా అసమాన ధీరులారా.. రాజధాని సమర సైనికులారా.. అమరావతికి అండగా నిలవండి.. భావి తరాలను కాపాడండి’’ అని సాగే ఉద్యమ గీతాన్ని అమరావతి జేఏసీ నేతలు విడుదల చేశారు. హైకోర్టు న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు ఈ గీతాలను రచించి ఆర్థిక సహకారం కూడా అందించారు. ప్రజా నాట్యమండలికి చెందిన రమణ బృందం ఈ గీతాలను ఆలపించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more