ఆఫ్ఘనిస్తాన్ ను తమ కబంధహస్తాలలోకి తీసుకున్న తాలిబన్లు.. అక్కడ అధికారాన్ని కూడా అందిపుచ్చుకుని పాలనను కూడా సాగిస్తున్నారు. అయితే తాలిబన్ల పాలనపై నమ్మకం లేని వేలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్తున్నారు. ఇప్పటికే విమానాల్లో విదేశాలకు వెళ్లే స్థోమత కలిగిన వాళ్లు వెళ్లగా, తాజాగా మరికోందరు దేశ సరిహద్దులను దాటేందుకు ఇటు పాకిస్థాన్ అటు ఉజ్బకిస్తాన్, ఇరాన్ దేశాలకు వెళ్లేందుకు సన్నదమై సరిహద్దులకు చేరకున్నారు. అయితే దేశంలో ఇస్లాం చట్టం షరియా మాత్రమే అమలు అవుతుందని చెప్పిన తాలిబన్లు ఇన్నాళ్లుగా కొనసాగిన ప్రజాస్వామ్యం మాత్రం చెల్లదని ఇప్పటికే సంకేతాలు పంపించారు.
ఇక దేశంలో ప్రజలను పాలించేందుకు ఆర్థికంగా బాగా వెనుకబడిన తాలిబన్లు ఇప్పుడు తమ దేశంలోని అక్రమ సంపాదన నిలువున్న ప్రాంతాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పాత ప్రభుత్వంలోని మంత్రులు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అప్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అష్రప్ సలేహ్ ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేసిన తాలిబన్లకు కొండంత ఆసరా లభించింది. ఆయన నివాసంలో ఏకంగా కట్టల కోద్దీ డబ్బులు బయటపడ్డాయి. సుమారు 6 మిలియన్ల విలువ చేసే డాలర్లు(మన కరెన్సీలో 45 కోట్ల రూ. దాకా), 18 పెద్ద బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
అఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన తర్వాత.. అమ్రూల్లా సలేహ్ తనను తాను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఆపై తాలిబన్ల ఆక్రమణ తర్వాత అజ్ఞాతంలో ఉంటూ.. తాలిబన్లతో పోరాటం కొనసాగుతుందని ప్రకటించాడు కూడా. పంజ్ షీర్ లో తలదాచుకున్న ఆయన అక్కడి బలగాల భద్రతలో కొన్ని రోజులు ఉన్న ఆయన.. తమ బలగాలు పట్టు కోల్పోతున్నాయని తెలియగానే విదేశాలకు వెళ్లిపో్యాడు. అయితే ఆయన ఇంట్లో తాజాగా సోదాలు నిర్వహించాగా భారీ అక్రమార్జన లభించిందని తాలిబన్ మల్టీమీడియా బ్రాంచ్ చీఫ్ అహ్మదుల్లా ముట్టాఖీ తన ట్విటర్లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు.
ఇక సలేహ్తో పాటు ఆయనకు అనుకూలంగా పని చేసిన మంత్రులు, అధికారులు, గత పాలనలో అవినీతికి పాల్పడ్డవాళ్ల ఇళ్లలోనూ తాలిబన్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా సోమ్ము సేకరించినట్లు తెలుస్తోంది. ఇక పరారీలో ఉన్న మరికొందరి దగ్గర సొమ్ము ఉండొచ్చని భావిస్తున్న తాలిబన్లు.. ఓ లిస్ట్ తయారు చేసుకుని వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే అఫ్గనిస్తాన్ను తాలిబనిస్తాన్గా మారడం తనకు ఇష్టం లేదని ప్రకటించుకున్న సలేహ్.. తాలిబన్ల ఆక్రమణ తర్వాత పంజ్షీర్కు పారిపోయాడు. అక్కడ ప్రతిఘటన దళాల నేత అహ్మద్ మస్సౌద్ తో కలిసి పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో సలేహ్ సోదరుడు రుల్లాహ్ను బంధించి, చిత్రహింసలు పెట్టి మరీ చంపారు తాలిబన్లు.
Security forces found 6.5 million US dollars and gold bricks in the house of former regime VP Amrullah Saleh. This is not even a fraction of what the former regime leadership stole from the poor Afghans. pic.twitter.com/PCue8nkd9q
— Muhammad Jalal (@MJalal700) September 13, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more