కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీకి చెందిన దాదాపు 5000 మంది ఇతర నేతల అకౌంట్లను లాక్ చేసిన ట్విట్టర్ సంస్థ తాజాగా వారినీ అన్లాక్ చేసింది. ఆగస్టు 1న ఢిల్లీలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య చేయడంతో మృత్యురాలి కుటుంబాన్ని కలసిన రాహుల్ గాంధీ వారిని పరామర్శించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్ల బాలిక కుటుంబసభ్యులతో దిగిన ఫోటోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీకి చెందిన ఏకంగా 5 వేల మంది నేతల అకౌంట్లను ట్విట్టర్ సంస్థ తాత్కాలికంగా లాక్ చేసిన విషయం తెలిసిందే.
అయితే తన ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా లాక్ చేయడంపై క్రితంరోజున రాహుల్ .. ట్విట్టర్ యాజమాన్యంపై విరుచుకుపడ్డారు. ట్వి్టర్ సంస్థ తమ పాలసిని కొనసాగించేందుకు బదులు అధికార బీజేపి పాలసీని ఫాలో అవుతుందని విమర్శించారు. భారతీయ రాజకీయ వ్యవస్థలో జోక్యం చేసుకుని ట్విట్టర్ సంస్థ ప్రమాదకర ఆట ఆడుతున్నట్లు రాహుల్ దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో దిగివచ్చిన ట్విట్టర్ సంస్థ యాజమాన్యం.. హుటాహుటిన దిదుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరిపై అమెరికాకు బదిలీ వేటు వేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.
మనీష్ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ గా ట్విటర్ నియమించనుంది. దీంతో మనీష్ మహేశ్వరి.. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ ఉన్న శాన్ఫ్రాన్సిస్కోకు మకాం మార్చనున్నారు. ఇదే క్రమంలో భారత్ లో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఓ డైరెక్టర్ ను నియమించరాదని ట్విటర్ నిర్ణయించింది. ఇక తమపై వచ్చిన అరోపణలను బాపుకునే ప్రయత్నాలు చేసిన ట్విట్టర్ సంస్థ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను తిరిగి అన్లాక్ చేసింది. అయితే అన్ లాకింగ్ కు సంబంధించి ట్విట్టర్ సంస్థ ఎటువంటి వివరణ ఇవ్వలేదని ఆ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి రోహన్ గుప్తా తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more