మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమ పార్టీలో ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించడం ఎంతవరకు సమంజసమని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీశారు. కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో జనం అర్థం చేసుకోవాలన్నారు. ఉద్యమంలో నిద్రహారాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన తనను ఓడించేందుకు.. మానుకొండలో ఉద్యమనేతలపై రాళ్లు రువ్విన వారికి ఇప్పుడు పార్టీలో పెద్దపీట వేస్తున్నారని దీనిని తెలంగాణ ప్రజలందరూ గుర్తించాలని అన్నారు.
కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజల మీద కంటే వారి ఓట్ల మీదే ప్రేమ ఎక్కువన్నారు. హుజూరాబాద్ ఎన్నిక రాగానే పెన్షన్ వస్తున్నాయి.. రేషన్ కార్డులు వస్తున్నాయి, యాదవులకు గోర్రెలు, మేకలు వస్తున్నాయి.. దళితులకు దళితబంధు వస్తుందని.. తన ఓడించేందుకు ఈ పథకాలను తీసుకువచ్చినా.. తన ప్రజలకు మేటు జరుగుతున్నందుకు తనకు సంతోషంగా వుందని ఈటెల అన్నారు. ప్రభుత్వం ఎన్ని పథకాలను తీసుకోచ్చినా.. అన్నింటినీ తీసుకుని.. ఎన్నికలలో మాత్రం ఓటు ఎవరికి వేయాలో కూడా తన హుజూరాబాద్ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు.
హుజూరాబాద్ లో గొల్ల, కుర్ముల ఓట్లు కొల్లగొట్టేందుకు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వమే భరిస్తుండటం మరింత సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. ఎన్నికల సమయం వచ్చిదంటే చాలు పథకాలు.. వరాలు కురిపించే కేసీఆర్ ఇప్పుడు దళితబంధు పథకాన్ని తీసుకోచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కానీ, సీఎంగా కానీ ఎప్పుడైనా ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారా అని ప్రశ్నించారు. ఏడు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ట్యాంక్ బండ్ పైనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయని కేసీఆర్…దళితులను గౌరవించే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు.
ఏడేళ్లలో సీఎం ఆఫీస్ లో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారి నియామకం జరగలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ కూడా అములు కాలేదని చెప్పారు. దళితుల జీవితాల్లో వెలుగు నింపలేదని విమర్శించారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి కాదు ఇచ్చిన ఉపముఖ్యమంత్రి పదవిని కూడా మున్నాళ్ల ముచ్చటే చేశాడని విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ.3116 భృతి ఇస్తామన్న వాగ్ధానాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. దళితబంధు పథకాన్ని యావత్తు తెలంగాణకు వర్తింపజేయాలని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more