మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర్ రావుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టులో ఊరట లభించింది. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం క్రితం రోజునే విచారణ చేపట్టింది. వాదనలు ముగిసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ అక్రమాలకు అధికార పార్టీకి చెందిన నాయకులు పాల్పడుతున్నారని అరోపణలు రావడంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన ఆయన తిరిగి వస్తుండగా ఆయన కారుపై దాడి జరిగింది. దీంతో ఆయన జి.కొండూరు పోలిస్ స్టేషన్ ఎదుట తన కారులోనే కూర్చోని ధర్నా చేస్తుండగా.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉద్దేశపూర్వకంగానే దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్టు పిటిషనర్ ఏ నేరానికీ పాల్పడలేదని చెప్పారు. ఫిర్యాదుదారుది ఏ సామాజికవర్గమో తెలియదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
కొండపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో గ్రామస్థులు అటవీ ప్రాంత సమస్యను దేవినేని ఉమ దృష్టికి తీసుకెళ్లటంతో అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఆ ప్రాంతానికి వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కస్టడీ కోసం మచిలీపట్నం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. కేసు విచారణ జరుగుతోందని.. మిగిలిన నిందితులను అరెస్టు చేయాల్సి ఉన్నందున ఈ దశలో బెయిల్ ఇవ్వటం సరికాదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. నిర్ణయాన్ని వాయిదా వేసింది. తాజాగా దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more