కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలుపరుస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై వారం రోజుల వ్యవధిలో రెండో పర్యాయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు ఉభయ సభలకు చెందిన విపక్ష సభ్యులతో ఇవాళ సమావేశమయ్యారు. విపక్ష పార్టీ నేతలతో కాన్ స్టూషన్ క్లబ్ లో జరిగిన విపక్ష పార్టీ ఎంపీల సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. ఇవాళ విపక్ష పార్టీలకు చెందిన సభ్యులకు బ్రేక్ ఫాస్ట్ మీట్ కు ఆహ్వానించిన ఆయన పార్లమెంటు ఎదుట మాక్ పార్లమెంట్ నిర్వహించే అంశంపై వారితో చర్చిచారు.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్లీడర్లలతో పాటు పలువురు ఎంపీలు కూడా ఈ అల్పాహార సమావేశానికి హాజరైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ కాంగ్రెస్, లోకతాంత్రిక్ జనతాదళ్ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా మనం అంతా కలిసి పోరాడాలని రాహుల్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన స్వరం వినిపిస్తే, మన స్వరం అంత బలంగా మారుతుందని కాంగ్రెస్ నేత తెలిపారు.
మాక్ పార్లమెంటు నిర్వహణ విషయమై చర్చించిన రాహుల్ గాంధీ.. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో ప్రజలపై పడుతున్న ఇంధన భారం.. తద్వరా నిత్యావసర సరుకులపై పడుతున్న భారం.. కరోనా కల్లోలాన్ని అదుపు చేయడంలో విఫలమైన పాలకపక్షం.. కరోనా బాధిత కుటుంబాలకు దక్కని ప్రభుత్వం అభయం.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా.. రైతులకు అండగా నిలవడం.. దేశంలోని ప్రముఖులకు ఫోన్లు ట్యాపింగ్ వ్యవహరాంతో పాటు ఇత్యది విషయాలపై మాక్ పార్లమెంటు నిర్వహించాలని కూడా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
విపక్ష పార్టీ నేతలతో అల్పాహారం సమావేశం తరువాత రాహుల్ గాంధీ.. తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనను వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు, గ్యాస్ సిలిండర్ ధరల నేపథ్యంలో ప్రజలకు మళ్లీ సైకిల్ పై ప్రయాణించే రోజులను గుర్తు చేస్తున్నాయంటూ ఆయన పార్లమెంట్ కు సైకిల్ యాత్ర చేపట్టారు. ఆ ర్యాలీలో విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఇదిలావుండగా ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో దాదాపుగా అన్ని రోజులు సమావేశాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి. పెగాసస్ వ్యవహారంపై చర్చ జరగాలని జేపీసి కమిటీతో విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూనే వున్నాయి.
मोदी सरकार की लूटनीति के खिलाफ कांग्रेस सड़क से लेकर संसद तक लड़ाई लड़ रही है।
— Congress (@INCIndia) August 3, 2021
मोदी सरकार को पेट्रोल-डीज़ल व गैस की बढ़ी हुई कीमतें वापस लेकर आम जन को राहत पहुंचानी ही होगी।#UnitedForDemocracy pic.twitter.com/zAL3zFlIRp
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more