ఇజ్రాయిల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ తో దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని విషయమై ఇవాళ కూడా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకంపనలు సృష్టించాయి. దేశభద్రతకు ముప్పును తెచ్చే ఉగ్రవాదులపై వినియోగించాల్సిన పెగాసెస్ ను దేశ ప్రజలపై వినియోగించారన్న అరోపణలతో తీవ్ర కలకలం రేగుతోంది. ఇప్పటికే విపక్షాలు కేంద్రం హోం మంత్రి అమిత్ షాను తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ చేస్తున్నాయి. స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజాగా పెగాసస్ విషయంపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు ఈ విషయలో కేంద్రప్రభుత్వాన్ని అదేశించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు కూడా లేఖ రాశాయి. ఇవాళ లోక్ సభలోనూ పెగాసస్ పై చర్చించాలని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు వాయిదా తీర్మాణానికి నోటీసులు ఇచ్చాయి. అయినా ఇవాళ కూడా కేంద్రం అందుకు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులతో కలసి పార్లమెంటు వద్ద సమావేశమైన రాహుల్ పార్లమెంటులో వ్యవహరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రజల పోన్లలో కేంద్రం ఆయుధాన్ని పెట్టిందని అరోపించారు. దేశప్రజలను స్వేచ్చగా మాట్లాడుకోలేని దయనీయస్థితికి తీసుకెళ్తోందని విమర్శించారు. పార్లమెంటులో తమ సంఖ్యబలంతో ప్రతిపక్షాల గోంతు నొక్కుతున్న కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం.. పెగాసెస్ అంశంపై చర్చించాలని తాము పట్టుబడుతున్నా అందుకు అనుమతించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ను కొన్నదా? లేదా? స్పష్టంగా చెప్పాలని నిలదీశారు. దేశ ప్రజలపై దానిని వాడారా? లేదా? అని ప్రశ్నించారు.
పెగాసస్ అనేది తమకు దేశద్రోహం లాంటిదేనని, ఈ ఆయుధాన్ని ప్రజాస్వామ్యంపై వాడారని అన్నారు. ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది కాదన్నారు. ఉగ్రవాదులపై వాడాల్సిన ఆయుధాన్ని మోదీ, అమిత్ షాలు ప్రజలపై వాడారన్నారు. దేశ ప్రజాస్వామ్యపు ఆత్మపై వారిద్దరూ దెబ్బకొట్టారన్నారు. పార్లమెంట్ లో పెగాసస్ అంశాన్ని ఎందుకు చర్చించరని ప్రశ్నించారు. తాము పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్నామంటూ ప్రభుత్వం ఆరోపిస్తోందని, అయితే, తమ విధులనే తాము నిర్వర్తిస్తున్నామని రాహుల్ అన్నారు. కాగా, పెగాసస్ అంశంపై 14 పార్టీలతో కలిసి రాహుల్ గాంధీ పోరాటానికి సిద్ధమయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more