ప్రతీఏటా ఆషాడమాసంలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోవిడ్ మహమ్మారి నుంచి తెలంగాణ బయటపడిందన్న నేపథ్యంలోనూ కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ.. అతిరధ మహారధులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి కళ్యాణాన్ని వీక్షించారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలను కూడా నిర్వహించారు.
బల్కంపేల ఎల్లమ్మతల్లి అనుగ్రహాన్ని పోందటంతో పాటు అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు నగరంతో పాటు రంగారెడ్డి సహా పలు జిల్లాలకు చెందిన భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మవారికి కల్యాణ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి బియ్యం పోసేందుకు కూడా భక్తులు పోటీపడ్డారు. అమ్మవారి కల్యాణ మహోత్సవం సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు.
అమ్మవారి కల్యాణాన్ని తిలకించి.. ఆశీర్వాదాలు పోందేందుకు మంత్రులు కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కల్యాణ వేడుకను నిర్వహించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా హాజరయ్యారు. కాగా అమ్మవారి కల్యాణమహోత్సవం సందర్భంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంక్షలు అమల్లో వున్నాయి. ఆలయ పరిసరాల్లో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలను పెట్టిన పోలీసులు, వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దారిమళ్లించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more