Diesel nears Rs 100/litre in Vijayawada and Bhopal మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. రూ.100 దిశగా డీజిల్ ధర

Fuel prices at new record highs diesel nears rs 100 litre in vijayawada and bhopal

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

Petrol and diesel prices: The price of petrol in Delhi currently stands at Rs 98.11 per litre while diesel is now selling at Rs 88.65. In Mumbai, petrol costs Rs 104.22, while diesel is retailing at Rs 96.15.

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. రూ.100 దిశగా డీజిల్ ధర2

Posted: 06/26/2021 12:14 PM IST
Fuel prices at new record highs diesel nears rs 100 litre in vijayawada and bhopal

ఇంధన ధరలను ఇకపై పెంచేది లేదని, ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు బీరాలు పోయిన కేంద్ర ప్రభుతం.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వరుసగా ఇంథన దరలను పెంచూతూ వస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాలలో లాక్ డౌన్ అములో వున్నా తమ ధరలకు మాత్రం ఎక్కడా చెక్ పెట్టేది లేదని నిర్ణయించుకున్న ఇంధన కెంపెనీలు ఏకంగా మే నెలలో 16వ సారి ఇంధన ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి. జూన్ నెలలో 16 సార్లు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గత ఏడాది మాత్రం లాక్ డౌన్ లో ఇంధన ధరల పెంపుకు బ్రేకులు వేసిన కేంద్రం.. అన్ లాక్ తరువాత క్రమంగా పెంచుతూ వచ్చింది.

ఫలితంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలను మించి పరుగులు పెడుతుండగా, ఇక తాజాగా డీజిల్ దర కూడా వంద మార్కును అందుకునేందుకు పరుగు పెడుతోంది. అంతర్జాతీయంగా పెద్దగా ధరల ప్రభావం లేకపోయినా దేశంలో మాత్రం ఇంధన ధరలకు అదనపు పన్నులు తోడవ్వంతో ధరలు భగ్గమంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు డిమాండ్‌ పెరగ్గా.. మూడేళ్ల గరిష్ఠానికి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి ధర బ్యారెల్‌కు 76 డాలర్లు దాటింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బ్రెంట్‌ 0.62 డాలర్లు పెరిగి.. యూఎస్‌ మార్కెట్‌లో బ్యారెల్‌కు 76.18 డాలర్లకు చేరింది. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ 0.75 డాలర్లు పెరిగి.. బ్యారెల్‌కు 74.05 డాలర్లు పలికింది.ఈ మేరకు పెట్రోల్‌, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.  ప్రభుత్వ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి.

ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 35 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 37 పైసల వరకూ పెంచాయి. మే 4 నుంచి నెలలో ఇప్పటివరకు చమురు ధరను 31 పర్యాయాలు పెంచిన కేంద్రం.. ఏకంగా అప్పట్నించి తాజా పెంపు వరకు పెట్రోల్ పై రూ.7.79, డీజిల్‌పై 7.87 వరకు చమరు కంపెనీలు పెంచాయి. ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకుంది. ముంబైలో పెట్రోల్ 100కి చేరుకుంది. అదే సమయంలో, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతూ సెంచరీ మార్కుకు చేరింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చిత్తూరు జిల్లాలో పెట్రోల్ ధర ఏకంగా రూ.100 దాటింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 98.11గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.88.65కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.104.22గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.96.16కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.99.18గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.93.22కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.97.99గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.91.49కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ..104.31 కాగా, లీటరు డీజిల్ ధర రూ.98.38కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.101.96గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.96.63కు చేరింది.
భోపాల్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.106.35గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.97.37కు చేరింది.
బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.101.39గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.93.98కు చేరింది.
పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.100.13గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.94కు చేరింది.
చండీగఢ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.94.35గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.88.29కు చేరింది.
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.95.29గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.89.06కు చేరింది.
రాంచీలో లీటరు పెట్రోల్ ధర రూ.93.82గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.93.57కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles